ఉత్కంఠ పోరులో బెజవాడ టైగర్స్ విజయం


Ens Balu
49
Visakhapatnam
2023-08-22 16:38:14

 ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ లోని డాక్టర్ వైయస్సార్ ఏ సిఏ విడిసిఏ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ సీజన్ - 2 లీగ్ మ్యాచ్ లో భాగంగా మంగళవారం సాయంత్రం జరిగిన  మ్యాచ్లో వైజాగ్ వారియర్స్, బెజవాడ టైగర్స్ జట్లు తలపడ్డాయి.7వికెట్ల నష్టానికి విజయం సాధించిన బెజవాడ టైగర్స్.తొలత టాస్ గెలుచుకున్న వైజాగ్ వారియర్స్ బ్యాటింగ్  ఎన్నుకొని బరిలోకి దిగారు. బ్యాటింగ్ తీసుకున్న వైజాగ్ వారియర్స్ జట్టు బ్యాట్స్ మ్యాన్లు 20 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 193 పరుగులు సాధించారు. ఓపెనర్ బ్యాట్స్ మ్యాన్లు ముగ్గురు సమష్టిగా రాణించిన మిగతా వారంతా అంతగా కృషి చేయాలేకపో యారు.దీంతో 193 పరుగుల టార్గెట్ ను బెజవాడ టైగర్స్ జట్టు ముందు నిలిపారు. బ్యాటింగ్ బరిలోకి దిగిన బెజవాడ టైగర్స్ బ్యాట్స్ మ్యాన్ లు గడిచిన 20  ఓవర్లలో 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. చివరి బాల్ వరకు ఉత్కంఠ భరితంగా మ్యాచ్ సాగింది.మిడిల్ ఆర్డర్ లో దిగిన షోయబ్ ఎం డి ఖాన్ 33 బంతుల్లో 51 పరుగులు చేసి అర్థ సెంచరీ పూర్తి చేశాడు. పి. అవినాష్ 30 బంతుల్లో 71 పరుగులు చేసి మ్యాచ్ ని టర్నింగ్ పాయింట్ చేసి విజయాన్ని వారి వైపు తిప్పి నాట్ అవుట్ గా చివరి వరకు నిలిచి మ్యన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. దీంతో 7 వికెట్లు నష్టానికి బెజవాడ టైగర్స్  విజయం కైవసం చేసుకుంది.