క్రీడా స్పూర్తిని నింపుతున్న వైఎస్సార్ క్రికెట్ కప్..


Ens Balu
1
Visakhapatnam
2020-12-23 21:20:25

క్రీడల్లో పాల్గొనడం వలన యువతకు మంచి వ్యాయామం చేకూరుతుందని, పాయకరావు పేట ఎమ్మెల్వే గొల్ల బాబురావు పేర్కొన్నారు . జగనన్న, వైఎస్ఆర్ క్రికెట్ పోటీలు నగరంలో 14 క్రీడామైధానాల్లో కొనసాగడం శుభపరిణామన్నారు. బుధవారం ఏయూ ఆర్ట్స్ కళాశాల క్రీడామైదానంలో జరుగుతున్న తూర్పు నియోజక వర్గం వార్డుల క్రికెట్ స్వాతిధాన్ జట్టును, కె.ఆర్.ఎం లెవెన్ జట్టు క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న పుట్టిన రోజు పురస్కరించుకుని పోర్టు క్రీడా మైదానంలో ఈనెల 21 నుంచి జనవరి 9 వరకూ ఈక్రికెట్ పోటీలు నిర్వహించడానికి ప్రగతి భారత్ పౌండేషన్, ఎంపి విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం గర్వించదగ్గ విషమన్నారు. ఈ పోటీలకు సాంకేతిక సహకారం అందిస్తున్న ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్యవి.వి.జి.డి . ప్రసాదరెడ్డి క్రీడావిభాగం డైరెక్టర్ ఆచార్య ఎన్ విజయమోహన్ ను అభినందించారు. క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఆడుతున్నారని ఉత్సాహపరిచారు. క్వాలిఫైడ్ తో ఎంపైర్లతో ఐపిఎల్ తరహాలో ఈ పోటీల్లో 98 వార్డులకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారని , ఈ కరోనా నేపద్యంలో యువత ఇంటికే పరిమితం అయిన నేపధ్యంలో ఈ క్రికెట్ పోటీలు ఎంతో ఊరటనిస్తున్నాయని అన్నారు.  ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాదరెడ్డి పోటీలను ఎమ్మెల్యే కు వివరించారు. క్రీడామైదానాలు పిచ్ రెండు వారాలు పాటు క్రీడలు నిమిత్తం సమాయత్తం చేసి అందుబాటులో ఉంచామని , ఈ నెల 21 న 42 జట్లు గెలిచాయని , మరో 12 జట్లు ఓడినప్పటికి క్రీడాకారులకు ప్రశంసా పత్రాలుతో పాటు మెడల్స్ అందించినట్లు తెలిపారు. మరో 42 మ్యాచ్ లు వివిధ క్రీడా ప్రాంగణాల్లో జరిగాయని తెలిపారు. ఏయూ క్రీడా విభాగం డైరెక్టర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య ఎన్. విజయమోహన్, విభాగం హెడ్ డాక్టర్ ఎ. పల్లవి , వైఎస్ఆర్ సిపి నాయకులు అక్కరమాని వెంకటరావు, 19 వ వార్డు కె. ధనలక్ష్మి ఆర్ట్స్ కళాశాల క్రీడాప్రాంగణం ఇన్ చార్జ్ డాక్టర్ జి.ఎస్.వర్మ , బిపిసి ఎంపైర్స్ , పిడిలు పాల్గొన్నారు.