క్రీడలతో యువతకు మానసిక ఉత్తేజం..
Ens Balu
2
Visakhapatnam
2020-12-24 17:08:19
క్రీడలతో యువతకు మానసిక ఉత్తేజం పెరుగుతుందని వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త డా.మళ్లవిజయప్రసాద్ అన్నారు. గురువారం బుల్లయ్య కాళాశాల మైదానంలో జరుగుతున్న వైఎస్సార్ క్రికెట్ కప్ పోటీలను ఆయన ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మళ్ల మాట్లాడుతూ, యువత క్రీడల్లో రాణించాలనే ఉద్దేశ్యంలో ఈ క్రికెట్ పోటీలను వైఎస్సార్సీపీ నిర్వహిస్తుందన్నారు. ఈ క్రికెట్ పోటీల్లో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని అన్నారు. అనంతరం 92, 57 వార్డులకు చెందిన జిహెచ్ఎస్ గోపాలపట్నం, పవర్ బాయ్స్ మధ్య జరిగిన పోటీని తిలకించారు. ఈ పోటీల్లో గెలుపొందిన జిహెచ్ఎస్ గోపాలపట్నం జట్టు అభినందించి షీల్డును అందజేశారు. ఇదే ఉత్సాహంతో ట్రోఫీ కొట్టే లక్ష్యంతో మరింత ఉత్సాహంగా ఆడాలని విన్నర్ టీమ్ ను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.