క్రీడలతో చిన్నారులకు శారీరక ధారుడ్యం..
Ens Balu
4
రాజమండ్రి
2021-02-25 21:51:53
క్రీడల ద్వారా బాలబాలకలకు మానసిక,శారీరక దృఢత్వంతోపాటు పోటీతత్వం అలవడతాయని జిల్లా కలెక్టరు డి. మురళీధర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన స్దానిక పుష్కర్ ఘాట్ వద్ద 32వ ఆంధప్రదేశ్ రాష్ట్ర ఇంటర్, జిల్లా రోలరు స్కేటింట్ చాంపియన్ షిఫి రాష్ట్ర స్దాయి స్కేటింగ్ పోటీల ర్యాలీ ఆయన ప్రారంబించి క్రీడాపోటీలకు నాంది పలికారు, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 32వ ఆంధప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ జిల్లా రోలరు స్కేటింగ్ అసోసియేషన్ ఆద్వర్యంలో జిల్లా రోలరు స్కేటింగ్ అసోసియెషన్ వారు రాజమహేంద్రి ఇంటర్నేషనల్ పాఠశాల సహకారంతో రాష్ట్ర స్దాయిలో పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. మన జిల్లాలో రాష్ట్ర స్దాయిలో స్కేటింగ్ పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషదాయకమన్నారు. ముఖ్యంగా బాలబాలికలు గత సంవత్సర కాలములో కోవిడ్-19 లాక్డౌన్ మూలంగా క్రీడలకు దూరంగా వున్నారని (ఎకడమిక్) విద్యా సంవత్సర నష్టపోకుండా విద్యాభోదనను ఆన్లైన్ ద్వారా సాకారం చేసుకున్నారన్నారు. క్రీడల పోటీలకు ప్రశాంత వాతావరణంలో మరలా కోవిడ్-19 నిబందనలు పాటిస్తూ సిద్దం కావడం మంచి పరిణామమన్నారు. బాలబాలికలు క్రీడల ద్వారా మానసిక ప్రశాంతతను, శారీరక దృఢత్వాన్ని పోందడంతోపాటుగా పోటీతత్వం, నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. ప్రస్తుత పోటీలలో గెలుపొంది ఇంటర్నేషనల్ స్దాయిలో కూడా గెలుపొంది రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో 13 జిల్లాలనుంచి సుమారు 400 మంది ఈ క్రీడలలో పాల్గొంటున్నారన్నారు. క్రీడా పోటీలు నిర్వహణను చేపట్టిన రాజమహేంద్రి ఇంటర్నేషనల్ పాఠశాల పౌండరు చైర్మన్ టి కె విశ్వేశ్వరరెడ్డిని ఆయనఈ సందర్బంగా ఆయన అభినందించి క్రీడాపోటీలకు హాజరు కాబడిన బాలబాలికలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సబ్ కలెక్టరు అనుపమ అంజలి మాట్లాడుతూ క్రీడాకారులు పోటీలలో ఉత్సాహంతో పాల్గోని విజయ పరంపర జాతీయ స్దాయివరకు కొనసాగించాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ అబ్రహం మాట్లాడుతూ ఇంత పెద్ద ఈవెంట్స్ నిర్వహించడం చాలా కష్టతరమైనది చాలా జాగ్రత్తలు వహించి సేఫ్గా పోటీలను నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. విద్యా రత్న అవార్డు గ్రహిత రాజమహేంద్రి విద్యాసంస్దల చైర్మన్ పౌండరు టి.కె విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలలోనే ఎన్నడూ నిర్వహించని విధంగా మొట్టమొదటిసారిగా స్కేటింగ్ పోటీలు రాష్ట్ర స్దాయిలో నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇంతవరకు జరగని విధంగా ఈపోటీలను నిర్వహించడానికి అన్నిచర్యలు తీసుకొవడం జరిగిందన్నారు. కేవలం టి.వి.లు డిస్కవరీ చానల్లో మాత్రమే ఈ తరహా పోటీలు ప్రజలు చూచి ఉంటారన్నారు. మార్చి 3వ తేదీనుంచి మార్చి 8 వ తేదీవరకు ఉదయం 6 గంటలనుంచి 11 గంటలవరకు మధ్యాహ్నాం 3 గంటలనుంచి రాత్రి 9 గంటలకు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ పోటీలను సంపత్నగరంలోని రాజమహేంద్రి ఇంటర్నేషన్ పాఠశాలనందు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలను ఉచితంగానే తిలకించే అవకాశముందన్నారు. 3వ తేదీన ప్రీసైల్, పెయిర్ స్కేటింగ్, 4న పిగన్ స్కేటింగ్, 5న సోల్డ్ డాన్సు షో గ్రూప్, 6, 7 తేదీలలో రోలరు ఇన్ లైన్ హాకీ 8న బ•హుమతులు ప్రదాన కార్యక్రమాలుంటాయన్నారు. 3వ తేదీ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, పోటీలను ఆరంబించడం జరుగుతుందని, చివరి రోజు 8న రాష్ట్ర బి.సి సంక్షేమ మంత్రి సిహెచ్ శ్రీనివాస వేణుగోనాలకృష్ట చేతులు మీదుగా బహుమతులు కార్యక్రమాలుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ పాఠశాల ప్రతినిదులు స్వరూపరెడ్డి, చంద్రశేఖర్ సత్యసౌందర్య తదితరులు పొల్గొన్నారు.