జాతీయ ఫెన్సింగ్ పోటీలకి ప్రణయ్..
Ens Balu
2
Narasannapeta
2021-03-18 17:03:59
ఒడిశా రాష్ట్రంలోని కటక్ లో ఈ నెల 25 నుంచి 28 వరకు జరగననున్న జాతీయస్థాయి పెన్సింగ్ పోటీలకు నరసన్నపేటలోని శర్వాణీ విద్యార్ధి దిబ్బ ప్రణయ్ ఎంపిక కావడం అభినందనీయమని రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు అన్నారు.. గురువారం విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్ధిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత నెల 27 నుంచి ఈ నెల 1 వరకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డిఎస్ఎ ఇండోర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో తృతీయ స్థానం దక్కించి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి చేరుకున్నాడన్నారు. ఈ సందర్భంగా అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ, ప్రణయ్ జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించి శ్రీకాకుళం జిల్లా పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. విద్యార్ధిని ప్రోత్సహిస్తూ రూ2వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త అంధవరపు సూరిబాబు, శర్వాణీ విద్యాలయం ఉపాధ్యాయులు సిబ్బంది కూడా పాల్గొన్నారు.