మహాలక్ష్మి కి రాష్ట్ర యోగ అవార్డుకి ..


Ens Balu
12
Srikakulam
2021-06-21 13:07:00

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వర్చువల్ యోగా కాంపిటీషన్ లో రాజాం మండలం ఏ వి పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన జె. మహాలక్ష్మి రాష్ట్రస్థాయి కన్సోలేషన్ అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డును గెలుచుకున్నందుకు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అభినందించారు. కలెక్టర్ కార్యాలయంలో మహాలక్ష్మి, ఆయుష్ వైద్యులు డాక్టర్ మాధవ రావు చౌదరి జిల్లా కలెక్టర్ కు కలిసి వివరాలను తెలియజేశారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ మాట్లాడుతూ జిల్లా మరిన్ని అవార్డులు సాధించాలని కోరారు. విద్యార్థులు యోగాలో భాగస్వామ్యం కావాలని తద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుందని పేర్కొన్నారు.