యోగాతో చక్కని ఆరోగ్యం సొంతం..


Ens Balu
12
Rajahmundry
2021-06-21 13:37:07

యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చునని నోడల్ అధికారి మిరియాల నాగభూషణం తెలిపారు. సోమవారం రాజమహేంద్రవరం గ్రామీణం జూన్ 21 బొమ్మూరు కోవిడ్ కేర్ కేంద్రంలో కోవిడ్ రోగులతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాపై అవగాహన చేపట్టినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు 450 మంది కోవిడ్ పేషెంట్లు, 150 మందికి యోగా శిక్షకులు బి నాగరాజు గారితో అర్ధ చక్రాసన. పాదహస్తాసన, శ్వాస సామర్ధ్యాన్ని పెంచే ఆసనాలు రోగనిరోధక శక్తిని పెంచే ప్రాణాయామం.మానసిక ప్రశాంతతకు సహకరించే ఆసనాలపై అవగాహన కల్పించారు. మానవాళికి సంక్రమించే సమస్త వ్యాధులబారిన పడకుండా దూరం చేసే ఏకైక దివ్య ఔషధం "యోగ అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా ప్రోటోకాల్ ప్రకారం సోమవారం  ఓంకారం, ప్రాణాయామం, ధ్యానం, యోగ ఆసనాలు వేశారన్నారు   వినయం, విధేయత, యోగ్యత రావాలంటే యోగసాధన బాల్యము నుండీ అలవార్చుకోవాలని మనిషి తనువును, మనస్సును, ఆత్మను ఏకంచేసే ఏకైక సాధనం "యోగ" మాత్రమేనని, అంతే కాకుండా ప్రపంచదేశాల ప్రజలు ఈ రోజు యోగాసాధన చేస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారంటే అది కేవలం భారతదేశం గొప్పతనమని అన్నారు. జె ఎన్ టి యు కోవిడ్ కేర్ కేంద్రం తరువాత బొమ్మూరు కోవిడ్ కేర్ కేంద్రంలో ఈ యోగా కార్యక్రమాలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో  మండల తాసిల్దార్ రియాజ్ హుస్సేన్ అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోమలి ఆర్ ఎం ఓ వి అశోక్ కుమార్ పాల్గొన్నారు.