ఛీర్స్ ఫ‌ర్‌ ఇండియా..


Ens Balu
3
విజయనగరం
2021-07-06 14:44:30

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఒలింపిక్స్ లో భార‌త క్రీడాకారులు ఘ‌న‌విజ‌యాల‌ను సాధించాల‌ని మంత్రులు, జిల్లాకు చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ఆకాంక్షించారు. క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ఏర్పాటు చేసిన ఛీర్స్ ఫ‌ర్ ఇండియా కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి పాముల పుష్ప‌శ్రీ‌వాణి, పుర‌పాల‌క శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్రారంభించారు. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భార‌త క్రీడాకారుల‌కు సెల్పీ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్,  ఎంఎల్ఏలు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు, అల‌జంగి జోగారావు, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు క్రీడాకారుల‌కు సెల్పీ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో సెట్విజ్ సిఇఓ విజ‌య‌కుమార్‌, జిల్లా క్రీడాధికారి వెంక‌టేశ్వ‌ర్రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.