టోక్కోలో భారత్ పతకాల పంట పండాలి..


Ens Balu
9
Visakhapatnam
2021-07-19 15:03:21

టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులకు మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అభినందనలు తెలిపారు. సోమవారం 10వ వార్డు, తోటగరువులోగల జిల్లా పరిషత్ హైస్కూలులో  క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమానికి మేయర్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రామంలో మేయర్  మాట్లాడుతూ జరుగుచున్న టోక్యో ఒలింపిక్స్ లో విశాఖ నగరం నుండి క్రీడాకారులు పాల్గొంటున్నందుకు చాల సంతోషంగా ఉందని అన్నారు. ఈ ఒలింపిక్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ వారిని ప్రోత్సహించుటకు సంతకాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ హై స్కూలు ఉపాధ్యాయులను మేయర్ అభినందించారు. క్రీడలు ప్రతీ  మనిషికీ ఉల్లాసాన్ని, ఉత్సాహాన్నిస్తూ, ఆరోగ్య రక్షణకు దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన నగర క్రీడా కారుడు అన్మిష్ వర్మను మేయర్ సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కార్పొరేటర్ ఎం. రామలక్ష్మి, వైసిపి నాయకులు గొలగాని శ్రీనివాస్, ఉప విద్యా శాఖాధికారి జి. ప్రేమ కుమార్, జిల్లా పరిషత్ హై స్కూలు ప్రధానోపాధ్యాయిని జి.కె.డి. భవాని, ఉపాధ్యాయులు ఎం. వర్ధిని, డి. సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.