టీ10 పోటీలు ప్రారంభించిన మేయర్ ..


Ens Balu
1
ఆంధ్రయూనివర్శిటీ
2021-08-06 14:31:10

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎంతో కృషి చేస్తున్నారని జివిఎంసీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి తెలిపారు.  ప్రభ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీ10 క్రికెట్ లీగ్  పోటీలను మేయర్ శుక్రవారం ఆంధ్రా యూనివర్సిటీ లోని జిమ్నాజియం  క్రీడా మైదానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ,  క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో  రాణించాలని, వారు ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాక్షించారు. ఈ టోర్నమెంట్లో జిల్లా వ్యాప్తంగా 32టీంలు పాల్గొన్నాయని తెలిపారు. అనంతరం మేయర్ బ్యాటింగు చేసి క్రీడాకారులలో ఉత్సాహాన్నినింపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ & ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మళ్ల విజయ ప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి పోటీల వలన యువతలో ప్రతిభ వెలికి వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు, యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విఎంఆర్డిఎ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల మాట్లాడుతూ క్రీడా పోటీల నిర్వాహకులను అభినందించారు. ఇటువంటి పోటీలకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  43వ వార్డ్ కార్పోరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ, ప్రభ క్రికెట్ అకాడమీ వ్యవస్థాపకులు తాటి ప్రభాకర్, గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు పీవీవీ సూర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్తి వీర రాఘవరెడ్డి, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, ఓగిరెడ్డి వెంకటరెడ్డి, శివా రెడ్డి, నేనుసైతం ఫౌండేషన్ చైర్మన్ కె. శివప్రసాద్, ప్రభ క్రికెట్ అకాడమీ వ్యవస్థాపకులు తాటి ప్రభాకర్,  బి. రవికాంత్, శీలం సురేఖ తదితరులు పాల్గొన్నారు.