జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వంలో పెద్దపీట.. ఎమ్యేల్యే అమర్నాధ్


Ens Balu
2
Visakhapatnam
2021-10-03 11:10:01

జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ పేర్కొన్నారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం. సిఎంఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటర్మీడియా స్పోర్ట్సు మీట్ క్రికెట్ ఫైనల్స్ పోటీలను ఆదివారం ఆయన ముఖ్య అతిధిగా హాజరై విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మీడియా సేవలు మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు.2005 విఏజే సంఘము తో పాటు అర్హులైన జర్నలిస్ట్స్ కి త్వరలోనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ముఖ్య మంత్రి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు.. జిల్లాఅధికార యంత్రాంగం..ప్రజాప్రతినిధులు, మీడియా స్నేహపూర్వక క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ అర్హత గల జర్నలిస్టులందరికి రెండవ దశ అక్రిడేషన్లు మంజూరు కార్యక్రమం జరుగుతుందన్నారు.. ఆక్రిడిటేషన్ లు.. ఆరోగ్య భీమా కు సంబందించి  కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. వి.జె.ఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీను బాబు, ఎస్.దుర్గారావులు మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా అంతర్మీడియా, రాష్ట్రస్థాయి క్రీడా పోటీల నిర్వహించిన  ఘనత వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ కే దక్కుతుందన్నారు .. పది రోజుల పాటు జరిగిన ఈ  స్పోర్ట్స్ మీట్ లో సుమారు 800 మంది జర్నలిస్టులు 13 కేటగిరీ ల్లో జరిగిన క్రీడల్లో పాల్గొన్నారని తెలిపారు..  కాయల వెంకట రెడ్డి మిత్రమండలి ప్రతినిధి కాయల సూరారెడ్డి మాట్లాడుతూ ప్రతిభను ప్రోత్సహించే మీడియా ప్రతినిధులను ఇటువంటి కార్యక్రమాలు ద్వారా ప్రోత్సహించడం అవసరమన్నారు. మీడియా అవార్డు కమిటీ చైర్మన్ ఆర్. నాగరాజ్ పట్నాయక్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో వి.జే.ఎఫ్. విస్జా ప్రతినిదులు పి.ఎన్. మూర్తి, దాడి రవికుమార్ ఈ ఈశ్వరరావు, డేవిడ్ రాజ్, ఎం.ఎస్. ఆర్. ప్రసాద్, వరలక్ష్మి .. ఉమాశంకర్ బాబు, జి. సాంబశివరావు, పవర్ డిప్లమో  ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు వి. మహేశ్వరెడ్డి, డాక్టర్ రామ్ కుమార్, బ్రహ్మకుమారీల   ఈశ్వరీయ విశ్వవిద్యాలయం రమక్క తదితరులు పాల్గోన్నారు. అనంతరం స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ చిన్నారులు, క్యాలు జనార్ధన్ ఆధ్వర్యంలోనిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.అతిథులు చేతుల మీదుగా బహూమతుల ప్రధానం చేసారు. క్రికెట్ విన్నర్ గా ఆంధ్రజ్యోతి, రన్నర్ గా విజేఎఫ్, సంయుక్త విజేతలుగా సాక్షి.. ఆంధ్రప్రభ, వి జేఎఫ్ క్రికెట్ టోర్నీ లో 13 జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. ఇందులో విన్నర్ గా ఆంద్ర జ్యోతి.. రన్నర్ గా విజేఎఫ్ లు నిలిచారు. మూడో స్థానం కి సంబంధించి సాక్షి.. ఆంధ్ర ప్రభ జట్లు ను సంయుక్త విజేత లు గా ప్రకటించి బహుమతులు అంద చేసారు..