స్వర్ణాలు సాధించిన మహిళా బాక్సర్లకు పురస్కారాలు..


Ens Balu
1
Narsipatnam
2021-10-10 11:47:50

సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ పోటీలలో నర్సీపట్నానికి చెందిన ఇద్దరు బాక్సర్లు బంగారు పతకం సాధించిన సందర్భంగా వారికి ఆదివారం మినీ స్టేడియంలోఓ నర్సీపట్నం బిజెపి నాయకులు  కాళ్ళ సుబ్బారావు ఆధ్వర్యంలో నగదు పురస్కారాలు అందజేశారు. మెడల్స్‌ సాధించిన పాపని, నాగమౌనిక, కోలుకుల కృష్ణవేణి పూలమాలలు శాలువాలతో సత్కరించి  అడిగర్ల సతీష్‌, బోలెం శివ, డిటిపి.ప్రభాకర్‌, కొప్పిశెట్టి మోహన్‌లు రూ.10వేల నగదు పురస్కారాలు అందించారు. నింజాస్‌ అకాడమీ ద్వారా నర్సీపట్నంలో పతకాలు సాధిస్తున్న క్రీడా కారులకు ఇకపై పారితోషకాలు సత్కారాలు నిర్వహిస్తామని బిజెపి టౌన్‌ ప్రెసిడెంట్‌, డైరెక్టర్‌ వెలగా జగన్నాధం(ఎన్‌ఆర్‌ఐ, యుఎస్‌ఎ) తెలిపారు. నింజాస్‌ అకాడమీ చైర్మన్‌ వెలగా నారాయణరావు మాట్లాడుతూ మన అకాడమీకి బిజెపి వారు క్రీడా పరికరాలు ఇది వరకు అందజేశారని, అలాగే గెలుపొందిన వారికీ నగదు ప్రోత్సాహకాలు ఇస్తూ  సహకరించడంపై అకాడమీ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలిపారు.