కరోనా వేక్సిన్ వేయించుకున్న సబ్ కలెక్టర్..


Ens Balu
43
Narsipatnam
2021-03-04 22:26:24

నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ తోపాటు అందరూ కోవిడ్ టీకా వేయించుకోవాలని నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అన్నారు. గురువారం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో  సూపరింటెండెంట్ డా. నీలవేణి పర్యవేక్షణ లో స్టాఫ్ నర్సు సి హెచ్ రామలక్ష్మి కోవిడ్ టీకాను సబ్ కలెక్టర్ కు వేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ టీకా ను అర్హులైన ప్రతీ ఒక్కరూ ఎటువంటి సందేహం లేకుండా  వేయించుకోవ డానికి ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. మూడవ దశ వాక్సినేషన్ లో భాగంగా కోవిషీల్డ్ టీకా ను వేయించుకోవడం జరిగిందని,ఎటువంటి అసౌకర్యం లేదని సబ్ కలెక్టర్ తెలిపారు. ఏరియా ఆసుపత్రి జనరల్ ఫిజీషియన్ డా నళిని,సబ్ స్టాఫ్ రత్నం తదితరులు పాల్గొన్నారు.