లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో
Ens Balu
12
Anakapalle
2022-05-11 16:48:49
మ్యూటేషన్ నిమిత్తం రూ. 7వేలు లంచం డిమాండ్ చేసిన వీఆర్వోని లంచం తీసుకుంటుం డగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీకి చిక్కిన అవినీతి చేప కధ వివరాలు తెలుసుకుంటే.. అనకాపల్లి సౌత్ విభాగ వీఆర్వోగా సూరిశెట్టి భవానీ వరప్రసాద్ పని చేస్తున్నారు. మ్యూటేషన్ కోసం స్థానిక బంగారం వ్యాపారి సూరిశెట్టి రామలింగ జగ్గా అప్పారావు కొన్నాళ్లుగా వారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే తనకు రూ.7వేలు లంచం ఇస్తే పని పూర్తవుతుందని వరప్రసాద్ చెబుతూ వచ్చారు. వీఆర్వో అడిగిన మొత్తం ఇస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని ఆ విషయాన్ని బాధితుడు అప్పారావు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. అధికారుల పథకం ప్రకారం బుధవారం వ్యాపారి నుంచి లంచం తీసుకుంటుండగా వరప్రసాద్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో వరప్రసాద్ పై కేసు నమోదు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశ పెడతామని అధికారులు తెలిపారు. ఏసీబీ దాడుల్లో డీఎస్పీ రామచంద్ర రావు, సీఐలు రమేష్, కిషోర్, ప్రేమ కుమార్, సతీష్, శ్రీనివాస్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.