ఓటీటీని ఎలా వచ్చిందో తెలిస్తే షాక్


Ens Balu
11
Hyderabad
2022-08-03 16:07:13

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనేలో కాదు..యావత్ భారత దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమ కొందరి బడా నిర్మాతల చేతుల్లో అనాది కాలం నుంచి బంధీగా ఉండిపోయింది. సినిమా విషయంలో వారు ఆడింది ఆట.. పాడింది పాట..ఈ నియంత్రుత్వ విధానానికి చరమ గీతం పాడాలంటే భారీ స్థాయిలో స్కెచ్ వేస్తే గానీ సరిపోదని భావించారు చిన్న నిర్మాతలు, దర్శకులు. సినీ పరిశ్రమకు చెందిన కొందరు కీలక సూత్రదారులు అలా తీవ్రంగా చేసిన ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చినదే ఈ ఓటిటి(ఓవర్ ది టాప్..Over The Top ఎప్పుడూ పైనే ఉండేలా) ప్రస్తుతం ఈ ఓటీటీ విధానం దేశవ్యాప్తంగా గానే కాదు ప్రపంచ వ్యాప్తంగా సినిమా రంగాన్ని ఓ కుదుపు కుదుపుతోంది. సాధారణంగా ఓటిటి వచ్చిన కొత్తలో టెక్నాలజీ తీసుకొచ్చిన మార్పుగా సినీ పరిశ్రమ భావించింది. అయితే అది టెక్నాలజీ తెచ్చినది కాదని..చాలా మంది మూకుమ్మడిగా టెక్నాలజీతోనే సినీ పరిశ్రమను తమ కబంధ హస్తాల్లోనే దాచిపెట్టిన బడా నిర్మాతలను కిందికి దించి.. వారి కొమ్ములు విరవడానికేననే సంకేతాలను పంపి ప్రజలకు సినిమాను చేరువ చేయడానికే ఈ ఓటీటీని తీసుకు వచ్చారనే విషయం నేడు తేటతెల్లమైంది. అలాకాకపోతే బడా నిర్మాతల సినిమాలకే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఉన్న సినిమా థియేటర్లు సరిపోయేవి. ఆ సమయంలో ఏ ఒక్క చిన్న సినిమా వచ్చినా దానిని ప్రదర్శించడానికి చిన్న నిర్మాతలకు సినిమాహాలు దొరికే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఒకవేళ కావాలంటే అత్యధిక మొత్తం వెచ్చించాల్సి వచ్చేది. అలాంటి సమయంలో చిన్న సినిమాలు ప్రజాదరణకు నోచుకోకపోతే ఆ నిర్మాత దివాలా తీసేవాడు. ఇలాంటి దోపిడీ వ్యవస్థ భూ స్థాపితం కావాలంటే థియేటర్ ఆలో ఆడే సినిమాను ప్రజల చేతిలోకి తీసుకురావాలని భావించే.. ఈ ఓటీటీని తీసుకొచ్చారనేది నేడు సినిమాల నిర్మాణాలు బంద్ కావడంతో అసలు విషయంపై అత్యధిక స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నీ వాళ్లవే..
తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలు, ఐనాక్స్ లు, ఐమాక్స్ లు ఇలా అన్ని సినిమా థియేటర్లు బడా నిర్మాతల చేతిలోనే ఉన్నాయి. కొందరు నిర్మాతలు, డైరెక్టర్లు అయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు నగరాల్లో వారే సొంతంగా సినిమా థియేటర్లు కూడా నిర్మించుకున్నారు. ఒక్కో సినిమా కాంప్లెక్స్ లో నాలుగైదు స్క్రీన్లు ఉండే విధంగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మరికొన్ని చోట్ల థియేటర్లన్నీ వారే లీజుకి తీసేకోవడంతో చిన్న సినిమాలు థియేటర్ కి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. చాలా కాలంగా చిన్న సినిమాలు పూర్తయినా వాటిని ప్రజల ముందుకి తీసుకు రావడం కోసం చిన్న నిర్మాతలు సుమారు ఆరు నెలలు వేచి వున్న రోజులు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఒక్క థియేటర్లే కాదు, తీసిన సినిమాను ల్యాబ్ లలో డెవలప్ చేయించడానికి, ఎడిటింగ్ లు చేయించడానికి కూడా చిన్న నిర్మాతలకు ల్యాబ్ లు కూడా అందుబాటులో ఉండేవి కాదు. ఈ తరుణంలో పెద్ద నిర్మాతలను చిన్న నిర్మాతలు ప్రసన్నం చేసుకొని ఒకటి అరా థియేటర్లు, నాలుగైదు ల్యాబ్ లు, మరో ఒకరిద్దరు ఎడిటర్లను అద్దెకు తెచ్చుకునే పరిస్థితులు ఉండేవి. ఇలాంటి పరిస్థితి కొనసాగితే చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలు కనుమరుగైపోతారని భావించిన కొందరు నిర్మాతలు ఈ ఓటీటీని తెరపైకి తీసుకొచ్చి. దాని స్థాయిని భారీ పెంచి ఓటీటీ ప్రాముఖ్యతను.. పాటకుడి సులువుని క్యాస్ చేసుకునే పనిలో పడ్డారు. తద్వారా బడా నిర్మాతలను ప్రసన్నం చేసుకునే పనిగానీ, వాళ్ల చుట్టు తిరిగి థియేటర్ల కోసం బతిమిలాడుకునే పని కూడా ఉండదు. థియేటర్లకు పెట్టే ఖర్చు కంటే చాలా తక్కు మొత్తంతో ప్రతీ ఒక్కరూ ఇంట్లోనే కూర్చుని సినిమా చూసుకోవడానికి వీలుపడుతుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలే కాదు..షార్ట్ ఫిల్మ్ లు, ప్రత్యేక దారావాహికాలు ఇలా అన్నీ ఓటీటీలోనే ప్రత్యక్షం అవుతున్నాయి. టిక్కట్లు బ్లాక్ కొని చూసే యాతన కూడా ప్రేక్షకులకు తప్పిపోయింది.

ఓటీటీ ద్వారా రెండింతల ఆదాయం
ఒకప్పుడు బడా నిర్మాతల దగ్గర సినిమా థియేటర్లు లీజుకి తీసుకుని సినిమా ఆడిస్తే..అది హిట్ అయితే తప్పా సినిమాపై పెట్టిన ఖర్చు నిర్మాతకి వచ్చేది కాదు..డైరెక్టర్ కి మరో సినిమా దొరికేది కాదు. ఈ ఓటీటీ ద్వారా నిర్మాతకు రెండింతల ఆదాయం వస్తుంది. సినిమా తీయడం పూర్తయిన తరువాత థియేటర్లపై పెట్టిన కర్చుతో ఏకంగా ఓటిటి ప్లాట్ ఫాంనే నిర్మించుకుంటున్నారు నిర్మాతలు. వాటిలో సినిమాను తక్కువ ధరకే పెట్టం ద్వారా ప్రతీ ఒక్కరూ చాలా చక్కగా ఇంట్లో కూర్చునే సినిమాలను చూసే అవకాశం కలుగుతుంది. అంతేకాదండోయ్ మధ్య మధ్యలో వచ్చేయాడ్స్ వలన కూడా నిర్మాతలకు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. సినిమాకి ముందు యూట్యూబ్ ప్రమోషన్ ద్వారా కూడా అత్యధిక ఆదాయాన్ని కూడా సొంతం చేసుకుంటున్నారు నిర్మాతలు. దీనితో ఎలాంటి నిర్మాతకైనా ఇపుడు సినిమా థియేటర్ అవసరం లేకుండా పోయింది. ఒక్క ఓటిటి ప్లాట్ ఫాం లీజుకి తీసుకుంటే చాలు తన సినిమా ప్రేక్షకుల ముందుకి వెళ్లిపోతుంది. ఒక వేళ ప్రధాన ఓటీటీ ప్లాట్ ఫాం స్లాట్ దొరక్కపోయినా..నిర్మాతే మంచి పేరుతో ఓటీటీని తయారు చేసి మరీ సినిమాలను జనాలపైకి వదులుతున్నాడు. ఇలా రెండు చేతులా సంపాదిస్తున్నారు నిర్మాతలు, దర్శకులు, సినిమా హీరోలతో సహా.

ఓటిటిపై అసలు ట్విస్ట్ తెలిస్తే నిజంగా షాక్ 
తెలుగు రాష్ట్రాలు, దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సినిమా థియేటర్ల కొరత వుంది. దానికితోడు బడా నిర్మాతల గుత్తాధిపత్యంతో చిన్ని నిర్మాతలు సినిమాలు అనుకున్న సమాయినికి తెరపైకి ఎక్కే పరిస్థితి లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన కొందరు టెక్నాలజీ తెలిసిన నిర్మాతలు
ఓటీటీని జనాల ముందుకి తీసుకు రావడంలో సఫలీ క్రుతులు అయ్యారు. దానికోసం అమెరికా, ఆస్ట్రేలియా, సిడ్నీ, సింగపూర్ లలో పనిచేసే సూపర్ న్యూమరిక్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు అత్యధిక మొత్తం చెల్లించి ఈ ఓటీటీని తెరపైకి తెచ్చారనే విషయం ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది.. అంతేకాకుండా యూట్యూబ్ ని కూడా కట్టడి చేయాలనే ఆలోచనతోనే ఈ ఓటీటీ తయారు చేయించినట్టుగా అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫాంను మొదట తయారు చేయించడానికి 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి తొలిసారిగా 2008లో భారత దేశంలో అభివ్రుద్ధి చేశారు. అయితే అప్పటికి టెక్నాలజీ అందుబాటులో ఉన్నా ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగం అంతగా లేదు. అంతేకాదు ఓటీటీకి సర్వర్ ఖర్చు కూడా వేల డాలర్లలో ఉండేది. సరిగ్గా 2012 నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం భారత్ లో పెరగడంతో సాఫ్ట్ వేర్ లో వున్న వివిధ రకాల వెర్షన్లును వినియోగించి అప్పటి నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చి 2018 నాటికి పెద్ద పెద్ద ఓటీటీ ఫ్లాట్ ఫాంలను తెరపైకి తీసుకు రాగలిగారు టెక్నాలజీ తెలిసిన నిర్మాతలు. ప్రొడక్షన్ సంస్థలు. 

అప్పటి నుంచి దేశంలోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ బడా నిర్మాతల గుత్తాధి పత్యానికి డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. ఇక చిన్న నిర్మాతలు వెనుతిరిగి చూడకుండా ఓటీటీపైనా, యూట్యూబ్ పైనా తమ పెట్టుబడిని పెట్టి ఛానల్ తయారు చేసుకొని మరీ ఆర్జించడం మొదలు పెట్టారు. అదికాస్త ఇపుడు చిలికి చిలికి గాలివానగా మారి ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారత దేశంలోనే ఓటీటీ ప్లాట్ ఫాంకు మంచి డిమాండ్ పెరిగిపోయింది. ఇదే పద్దతి కొనసాగితే రానున్న రోజుల్లో సినిమా థియేటర్లన్నీ షాపింగ్ మాల్స్ గా మారిపోవడం ఖాయమనే సంకేతాలు ప్రస్తుతం అన్ని నగరాల్లో మూతపడుతున్న థియేటర్ల సంఖ్యే రుజువు చేస్తున్నది. బడా నిర్మాతలకు, ఓటీటీ ఫ్లాట్ ఫాంలకు జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం, సినిమా నిర్మాణాల విషయంలో జరుగుతున్న గొడవలు ఎంత వరకూ దారితీస్తాయనేది ఉత్కంఠగా మారింది. మరో ఇంట్రస్టింగ్ టాపిక్ ఏంటంటే ప్రస్తుతం ప్రస్తుతం ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థలు కూడా ఓటీటీలు ప్రారంభిస్తుండటంతో సినిమా థియేటర్లు కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అవే ఆన్ లైన్ డెలివరీ సంస్థలకు సినిమా థియేగర్లు స్టాట్ గోడౌన్లుగా మారిపోయినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదని చెబుతున్నారు విశ్లేషకులు. చూడాలి. ఓటీటీకి..సినిమా థియేటర్లకు మధ్య జరుగుతున్న యుద్దంలో ఎవరిది పైచేయి అవుతుందనేది..!