కరోనాతో తెలుగు హాస్య నటుడు మృతి..
Ens Balu
3
Narsapuram
2020-09-24 14:54:40
కరోనా వైరస్ మరో ప్రముఖ తెలుగు నటుడిని బలి తీసుకుంది. ఎన్నో సినిమాల్లో కమెడియన్గా నటించిన కోసూరి వేణుగోపాల్ కరోనా వైరస్ తో కన్నుమూశారు. గత 22 రోజులుగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్న వేణుగోపాల్ బుధవారం రాత్రి మరణించారు. కరోనా నెగిటివ్ వచ్చాక కూడా ఆయన అనారోగ్యం నుంచి కోలుకోలేకపోవడం విశేషం. నర్సాపురంకు చెందిన వేణుగోపాల్ ఎఫ్సీఐ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. దాదాపు 27 సంవత్సరాలుగా నటిస్తున్న ఆయన `పిల్ల జమిందార్`, `మర్యాద రామన్న`, `విక్రమార్కుడు`, `అమీతుమీ`, `ఛలో` తదితర చిత్రాలలో నటించారు. ఆయన ఆకస్మిక మృతితో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పలువురు నటులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఇప్పటికే చాలా మంది తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు కరోనా భారిన పడగా, ఈయన మ్రుతితో వారందరిలో ఆందోళన మరింత పెరిగింది. ఇటు నర్సాపురంలో కూడా విషాద చాయలు అలముకున్నాయి...