టాలీవుడ్ లో విషాధం..నటి జమున కన్నుమూత


Ens Balu
10
Hyderabad
2023-01-27 04:18:25

తెలుగు చిత్రసీమ సీనియర్ నటి జమున(86) ఈరోజు ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని తన నివాసంలో  తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం 11 గంటలకు జమున మృతదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తరలించనున్నారు. జమున 1930 ఆగస్టు 30న హంపిలో జన్మించారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. 1953 లో పుట్టిల్లు సినిమాతో ఆమె తెరంగేట్రం చేశారు. 1955లో మిస్సమ్మ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.