డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి హఠాత్మరణం


Ens Balu
11
Chennai
2023-01-27 08:53:50

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎ.శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. చెన్నైలో శుక్రవారం ఉదయం గుండెపోటుతో అయన తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస మూర్తి తమిళ హీరో సూర్యకు తెలుగులో డబ్బింగ్ చెప్పి పాపులర్ అయ్యారు. రాజశేఖర్, అజిత్ కుమార్, విక్రమ్, మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, ఉపేంద్ర, ప్రభుదేవా లాంటి హీరోలకు ఆయన డబ్బింగ్ చెప్పారు. వాటిపాటు ఎన్నో యాడ్ ఫిల్మ్ లు, డాక్యుమెంటరీలకు ఆయన డబ్బింగ్ చెప్పారు. విషయం తెలుసుకున్న హీరో సూర్య తన ప్రగాఢ సంతాపాన్న తెలియజేశారు.