విశ్వనాధ్ మృతిపట్ల ప్రధాని, సీఎం సంతాపం


Ens Balu
14
Chennai
2023-02-03 05:36:34

ప్రముఖ దర్శకుడు కే.విశ్వనాథ్ నేడు మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు. 'శ్రీ కె. విశ్వనాథ్ గారు మృతి చెందడం బాధాకరం. అతను ఒక సృజనాత్మక మరియు బహుముఖ దర్శకుడిగా సినీ ప్రపంచంలోని ప్రముఖుడు. ఆయన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి' అని ట్వీట్ చేశారు. ఆయనతోపాటు సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కూడా తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. విశ్వనాధ్ మృతి సినీరంగానికి తీరని లోటని అన్నారు.  వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు ప్రకటించారు.