ఆహా తలుపు తట్టిన 'వినరో భాగ్యము విష్ణు కథ'


Ens Balu
24
Hyderabad
2023-03-15 16:29:38

ఆహా తలుపు తట్టింది కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా. రిలీజ్ అయిన తరువాత మంచి సక్సెస్ ను  కూడా సాధించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరగింది. మురళీ కిశోర్ దర్శకత్వం వహించగా.. ఫిబ్రవరి 17వ తేదీన థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా, తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకుంది.  కశ్మీర పరదేశి కథానాయికగా నటించిన ఈ సినిమా, మొదటి నుంచి చివరివరకూ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. మురళీశర్మ కామెడీ .. చైతన్ భరద్వాజ్ సంగీతం ఈ సినిమాకి హైలైట్స్ గా నిలిచాయి. ఈ సినిమా మంచి వసూళ్లను సైతం రాబట్టింది. అలాంటి ఈ సినిమా 'ఆహా' ద్వారా పలకరించడానికి రెడీ అయిపోయింది. 'ఉగాది' పండుగ సందర్భంగా ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉందని సినిమా వర్గాలు పేర్కొన్నాయి. ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ ఈ సినిమాలో ఉంది. ఆహాలో వచ్చి ఇపుడు ప్రేక్షకులను పలుకరించబోతుంది. సో రెడీగా ఉండండి.