మోహన్ బాబు సినిమా ఎంట్రీ@45..
Ens Balu
4
Visakhapatnam
2020-11-22 09:24:31
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమా రంగ ప్రవేశానికి సరిగ్గా 45 సంవత్సరాలు నేటితో పూర్తయింది. దర్శకరత్న దాసరి నారాయణరావు అందరూ నూతన నటీనటులతో "స్వర్గం -నరకం" చిత్రం నిర్మించారు. ఆ చిత్రం 22-11-1975 విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా మోహన్ బాబు , ఫటాఫట్ జయలక్ష్మి, ఈశ్వరరావు , అన్నపూర్ణ వంటి నటీనటులను వెండితెరకు పరిచయం చేశారు దర్శకరత్న.వీరిలో ఈశ్వరరావు, ఫటాఫట్ జయలక్ష్మి, అన్నపూర్ణ వంటి వారు నటీనటులు గా రాణించారు . కాగా మంచు భక్తవత్సలం నాయుడు గా ఉన్న వ్యక్తిని మోహన్ బాబుగా పేరు మార్చి తెలుగుతెరకు పరిచయం చేశారు. మోహన్ బాబు ఈ చిత్రం విడుదలైన తర్వాత ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు .దుష్టపాత్రలను, హీరో పాత్రలను, క్యారెక్టర్ ఆర్టిస్టుగా,కామెడీ ఆర్టిస్ట్ గా పలు పాత్రలను పోషించి ,ఆ పాత్రలకు ఎంతో న్యాయం చేకూర్చారు .ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించిన మోహన్ బాబు విలక్షణమైన, సలక్షణమైన నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యి నేటికి నలభై అయిదు వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈఎన్ఎస్ సినిమా డెస్క్ శుభాకాంక్షలు. తెలియజేస్తుంది.