‘దాగుడుమూతల దాంపత్యం’ @ 30


Naveen Prasad
3
సినిమా న్యూస్ డెస్క్
2020-11-30 13:14:55

బోగవిల్లి ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో శ్రీ విజయ ప్రసన్న ఫిలింస్ బ్యానర్ పై "దాగుడుమూతల దాంపత్యం" నిర్మాణమై నేటికి 30 ఏళ్లు గడుస్తోంది.  ఈ చిత్రం లో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు , నట కిరీటి రాజేంద్రప్రసాద్, ఊర్వశి శారద ,వాణీ విశ్వనాథ్ ,రమ్యకృష్ణ మొదలగు నటీనటులు నటించారు. ఈ చిత్రం విడుదల తేదీ 30-11-1990. నేటితో ఈ చిత్రం విడుదల ముప్పై వసంతాలు పూర్తి చేసుకుంది. సంగీతం M.M.కీరవాణి సమకూర్చారు.  ఈ హాస్య రస భరిత చిత్రానికి రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించారు. ఎబౌ యావరేజ్ చిత్రంగా బాక్సాఫీస్ వద్ద నమోదు కాబడింది. మంచి, కధ, తారాగణంలో నిర్మిత మైన ఈ కుటుంబ కధా చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నేటికీ ఈ సినిమా టెలివిజన్ సెట్లో వచ్చినప్పుడు తెలుగు  ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. ముఖ్యంగా ఈ సినిమాకి కునుంబ నేపథ్యం వున్న టైటిల్ వుండటం  ఒక కారణం అయితే..ఏఎన్ఆర్, రాజేంద్రప్రసాద్ నటన ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది..