"ఉడుకునెత్తురు" తెరదీమీదకి రాలేనిది అందుకే..


Naveen Prasad
6
సినిమా డెస్క్
2020-12-28 17:53:09

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు  వీరాభిమాని దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ట్రెండ్ సెట్టర్ నాగార్జున తో "మజ్ను "చిత్రం నిర్మించారు. ఈ చిత్రం అఖండ విజయం సాధించింది నాగార్జునను నటుడిగా ఎంతో ఎత్తుకు తీసుకుని వెళ్లింది . అక్కినేని వంశాభిమానులకు ఈ చిత్రం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నటనలో అఖిలభారత విషాద చక్రవర్తిగా పలుమార్లు నిరూపించుకున్నారు అక్కినేని. ఈ చిత్రంలో తన నయనాలతో అద్భుతమైన నటనను ప్రదర్శించి అక్కినేని నట వారసుదుగా తెలుగు ప్రేక్షకులతో ప్రశంసలను అందుకున్నారు అక్కినేని నాగార్జున. డాక్టర్ ANR&DNR కాంబినేషన్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి .అలాగే ట్రెండ్ సెట్టర్ నాగార్జున ,దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్లో కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలు వస్తాయని ఆశించారు తెలుగు ప్రేక్షకులు.  దర్శకరత్న దాసరి నారాయణరావు సొంత బ్యానర్ తారక ప్రభు బ్యానర్పై "ఉడుకునెత్తురు" చిత్రాన్ని నిర్మించే ఆలోచన చేశారు దాసరి. గానీ ఆ ఆలోచన ఆలోచన గానే ఉండిపోయింది . కొన్ని కారణాంతరాల వల్ల ఆచరణలో ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేకపోయింది. ఆ సినిమా టైటిల్ పేరు చెబితే ఇంకా దాసరి కళ్ల ముందు మెదలాడతారు. ఎంతో మంచి కధా కధనంతొో రూపొందతుందనుకున్న ఈ సినిమా ఆగిపోవడానికి చిత్రసీమ చాలా పెద్ద సినిమా కధలే అల్లింది..