నిండుమనిషి చిత్రానికి 43 వసంతాలు..


Naveen Prasad
2
సినిమాడెస్క్
2021-01-26 13:39:41

లక్ష్మీ ఫిలింస్ కంబైన్స్ బ్యానర్ పై N.R.అనురాధాదేవి నిర్మించిన చిత్రం  " నిండుమనిషి"  ఈ చిత్రంలో కథానాయకుడు "హీమ్యాన్", "నటభూషణ" శోభన్‌బాబు. చిత్ర కథానాయిక జయచిత్ర, సంగీతం : సత్యం . ఈ చిత్రానికి ఎస్ .డి .లాల్ దర్శకత్వం వహించారు. కెమెరామెన్: గోపాలకృష్ణన్ .చిత్రం విడుదల తేదీ 26-01-1978. ఇప్పటికి ఈ సినిమా విడుదలై నేటికి 43 సంవత్సరాలు అవుతుంది. అప్పట్లో సినిమాలను ప్రేక్షకులను విశేషంగా అలరించేవి. ముఖ్యంగా సినిమా టైటిట్స్ తోనే హీరోలు, హీరోయిన్ లు ప్రేక్షకులు బాగా గుర్తు పెట్టుకునేవారు. ఆ సినిమాల్లో వారి నటనకు ఫిదా అయిపోతూ, సినిమాలో జీవించిన పాత్రను నిజజీవితంతోనూ వారితో పోల్చుకుంటూ చాలా మంది గడిపేవారంటే అతిశయోక్తి కాదు. శోభన్ బాబుకి ప్రతీ సినిమాకి ఒక వైవిధ్యం చూపించడం అలవాటు. నిండు మనిషి చిత్రంలో శోభన్ బాబు నటన ఏ స్థాయిలో ప్రేక్షకులకు ఆకట్టుకుందంటే..ఏదైనా మంచి పనిచేస్తే నిండు మనిషి చిత్రంలో శోభన్ బాబు గుర్తొచ్చారు అనేంతగా ప్రేక్షకులు సినిమాలను ఆదరించేవారు. అలా సినిమా టైటిళ్లు ప్రేక్షకుల నిజజీవితాల్లో ప్రభావితం చూపించేవి..!