ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్టోబర్ 1వ తేదీన నేషనల్ రిజిస్టర్ లో నమోదు చేసుకో నటువంటి ఏ.ఆర్.టి/ సరోగసి కేంద్రాలు మూసి వేస్తామని డిఎంహెచ్ఓ డా.ఎ.హేమంత్ తెలియజేశారు. ఈ మేరకు బుధవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. నిర్దేశించిన మొత్తం చెల్లించని దరఖాస్తులు స్వీకరించరని పేర్కొన్నారు. అంతేకాకుండా వారి సర్వీసులు వెంటనే నిలిపివేయాలని కూడా ఆదేశాలు జారీచేశారు. నిబంధనలు అతిక్రమించిన వాటిని సీజ్ చేస్తామని తెలియజేశారు. నేషనల్ రిజిస్టర్ నుండి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులు తక్షణమే సమర్పించాలని నిర్వాహకులకు తెలియజేశారు. గతంలో pcpndt యాక్ట్ కింద రిజిస్టరై ఇప్పుడు దరఖాస్తు చేయని ఏ.ఆర్.టి కేంద్రాలను కూడా సీజ్ చేస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఇటువంటి సెంటర్లకు నోటీసులు ఇచ్చి pcpndt కింద మరల రిజిస్టర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు. ఏఆర్టీ కేంద్రాలను రద్దు చేయాలనుకుంటే జిల్లా అథారిటీ నుండి పర్మిషన్ తీసుకోవాలని, రాష్ట్ర కార్యాలయానికి తెలియజేయాలని ఆ ప్రకటనలో తెలియజేశారు.