ఆ అయస్కాంత చికిత్సతో నొప్పులన్నీ మటుమాయం


Ens Balu
165
Vijayawada
2023-01-25 05:02:44

వైద్యరంగంలో ఎన్ని కొత్త ఆవిష్కరణలు వచ్చినా నేటికీ మకుటంలేని మహారాజులా మాగ్నెటిక్ థెరపీ(ఆయస్కాంత వైద్యం)ని ప్రజలు ఆదరిస్తున్నారు. దాని ద్వారా 
ఎలాంటి దీర్ఘకాలిక మోకాళ్ల నొప్పులైని ఇట్టే మటుమాయం అవుతుండటమే దానికి ప్రధాన కారణం. మందులు, ఇంజక్షన్లకు అలవాటు పడి తాత్కాలిక ప్రయోజనం పొందే కంటే..దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందాలంటే మాత్రం ఆ మాగ్నెటిక్ థెరపీనే చక్కటి మార్గంగా దీనిని ఉపయోగించిన వారంత చెబుతుండటం విశేషం. అయితే ఈ వైద్య విధానం పూర్తిస్థాయిలో తెలియాలంటే  అది బాగా చదువుకున్నవారికి సాంకేతికంగా అర్ధమయితే..దీనిని వినియోగించిన వారు పొందిన స్వాంతన ద్వారా మిగిలిన వారికి తెలియజేస్తున్నారు. కోవిడ్ తరువాత వస్తున్న చాలా మార్పుల్లో కీళ్ల నొప్పులకి కూడా చాలా మంది పెయిన్ కిల్లర్స్ ను వినియోగిస్తున్నారు. అలాకాకుండా ఈ మాగ్నెటిక్ థెరపీని వినియోగించడం వలన ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చునని చెబుతున్నారు దీని సృష్టికర్త కడిమిశెట్టి సత్య శేషు కుమార్. దీని వినియోగం ఎలా పనిచేస్తుందనే విషయాన్ని ఒక్కసారి తెలుసుకుంటే..

అయస్కాంత వైద్యం (మాగ్నెట్ థెరపీ) లో గత 30 ఏళ్లగా ఎన్నో పరిశోధనలు చేసి ఎంతో మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన అన్మోల్ పల్సర్ ను నిర్మించిన 
కడిమిశెట్టి సత్య శేషు కుమార్ నేడు ఇంకో కొత్త మోడల్ ను రూపొందించి. అన్మోల్ పల్సర్ V1 గా పిలువ బడే ఈకొత్త పరికరంవల్ల దీర్ఘకాలిక మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు, రక్త ప్రసరణ సరిగాలేక  వెరికోస్, గాంగ్రీన్ లాంటి వాటికి కూడా ఎంతోబాగా పనిచేస్తుందని చెబుతున్నారు. షుగర్ వ్యాధి వల్ల వొచ్చే మానని కాళ్ళ పుళ్ళకు కూడా ఎంతో ఉపయోగం అని, వైద్యుని పర్యవేక్షణలో ఇంటిలో కూడా ఈ పరికరాన్ని వాడుకోవచ్చని వివరిస్తున్నారు. దీనిని వినియోగించడం అత్యంత సులభమని, వాడుకోవటానికి పెద్దగా ఎటువంటి  ట్రైనింగ్ అవసరం కూడా లేదంటున్నారు.

 భారతీయ పరిస్థితులకు తగ్గట్టుగా దీనిని తయారు చేశానని, నేడు చాలా మంది వైద్యులు వారి వారి వైద్య పద్దతులలో అన్మోల్ పల్సర్ కూడా చేర్చి వారి పేషెంట్లకు 
ఎంతో త్వరగా ఆరోగ్యాన్ని ప్రాసాదించ గలుగుతున్నారని చెప్పారు. ప్రధానంగా ఈ పరికారినికి ఏడు ప్రధాన పార్టీలు వుంటాయని, ఒక కరెంటు ఆడాప్తర్, ఒక కాన్వార్తార్   ఒక ప్రోబ్, రెండు త్రికోణ మాగ్నెటిక్ పాడ్స్ మరియు రెండు పాడ్స్ పాదాలకి తగిలుంచుకునేవి వుంటాయని, అవి ఒక నిర్ణీత పద్ధతిలో ఏర్పాటు చేసినప్పుడు ఆయుర్వేద పంచ భౌతిక సిద్ధాంత పరంగా ఆకాశ మహా భూతం యొక్క తన్మాత్ర అయినటువంటి విద్యుద్ అయస్కాంత శక్తి ప్రసరించి శరీరం యొక్క భౌతిక అయస్కాంత శక్తి కి తోడయ్యి కావలసిన మెటబోలిక్ కరెక్షన్ జరగటానికి ఎంతో అవకాశం ఉంటుందని వివరించారు.

నేటి వరకు ఎంతో మంది ఆయుర్వేద, అల్లోపతి వైద్యులు వారి వారి పేషెంట్లకు ఇచ్చి / ఇప్పించి సమాజానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇవ్వగలుగు తున్నారని.. ఈ 
పరికరాన్ని కొన్ని విదేశాలకు సైతం ఇపుడు పంపిస్తున్నామని చెప్పారు. స్వతహాగా మెడికల్ కుటుంబానికి చెందిన వారవ్వటం వలన దివంగత డాక్టర్ నంబూరి 
హనుమంత రావు సమక్షంలో ఈ పరికరాన్ని ఇంప్రూవ్ చేయగలిగానని, తండ్రి కడిమిశెట్టి సత్యనారాయణ (చిన్న పిల్లల వైద్యులు)  ద్వారా ఇది అభ్యసించానని, 
నంబూరి భాస్కర వేణు గోపాల రావు(ఆయుర్వేద వైద్యులు) తగిన సూచన సలహాలు ఇస్తుంటారని, అంటే గాక పేషెంట్ల యొక్క రెస్సాన్స్, ప్రాక్టికల్ ఇష్యూస్ ని 
ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అభివృద్ధి చూస్తుంటానని చెప్పారు. 

దీని ప్రారంభ ఖరీదు సుమారు రూ.10వేలని ఐతే ఇది వాడుతున్నప్పుడు ఆహార విహారాలు మీద కూడా శ్రద్ధ పెట్టాలని అందువలన ధాతు సంరక్షణ సరిగా జరిగి 
ధాతు పుష్టి పెరిగి, సమతుల్యత పెరిగి దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని పొందడానికి వీలుపడుతుందన్నారు.నేడు ఆయుష్ కూడా అయస్కాంత వైద్యాన్ని గుర్తించిందని , ఐతే ఇంకా పూర్తి వివరణ ఇవ్వటానికి ఒక కమీటీ అవరం వున్నదని, తానూ ఇంకొంతమంది వైద్యుల బృందం తో ఆ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ పరికరం కావాల్సిన వారు 9014110759 లో సంప్రదించి యూనిట్లను కొనుగోలు, వినియోగ వివరాలు తెలుసుకోవచ్చునని అన్నారు.