ప్రతీఒక్కరూ కోవిడ్ వేక్సిన్ వేయించుకోవాలి..
Ens Balu
4
Kakinada
2021-03-04 15:17:38
జిల్లాలో 60 ఏళ్లకు పైబడిన వారు, 45-59 ఏళ్ల మధ్యగల దీర్ఘకాలిక వ్యాధులు (కో-మార్బిడ్) ఉన్నవారు ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ వ్యాక్సిన్ పొందేందుకు కోవిన్-2.0 ఆన్లైన్ పోర్టల్లో ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఇన్ఛార్జ్ డీఎంహెచ్వో డా. ఎన్.ప్రసన్నకుమార్ తెలిపారు. ఈ లబ్ధిదారులు తప్పనిసరిగా https://www.cowin.gov.in/ వెబ్సైట్లో నమోదు చేయించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డును తీసుకెళ్లాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి వ్యాధిని తెలియజేసే ధ్రువీకరణపత్రాన్నితీసుకోవాలన్నారు. జిల్లాలోని 65 ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుబంధ ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.250 (డోసుకు రూ.150, సేవా రుసుం రూ.100) చెల్లించి వ్యాక్సిన్ పొందొచ్చన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కేంద్రంలో ఉచితంగా, ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుబంధ ప్రైవేటు ఆసుపత్రిలో రుసుం చెల్లించి వ్యాక్సిన్ వేయించుకోవచ్చని ప్రసన్నకుమార్ తెలిపారు.