జేమ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం..


Ens Balu
3
Srikakulam
2021-03-06 19:24:38

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన  జేమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ మరియు జిల్లాలో మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు జెమ్స్ ఆసుపత్రి సహాయ ఆర్.ఎం.ఓ డా.ప్రవీణ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ జె నివాస్, పోలీసు సూపరింటిండెంట్ అమిత్  బార్దార్ ల సూచనల మేరకు వైద్య శిబిరాలను సోమ వారం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రెవెన్యూ,  పంచాయతీరాజ్ శాఖల సిబ్బందికి కలెక్టర్ కార్యాలయంలో  ఏర్పాటు చేస్తున్నామని, ఆయా శాఖలలో పనిచేస్తున్న మహిళలతో పాటు వారి కుటుంబ సభ్యులు వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.  పోలీస్ సిబ్బందికి ఎచ్చర్ల పోలీస్ కమ్యూనిటీ హాల్ లో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో జిల్లాలోని మహిళా పోలీసులతో పాటు, హోంగార్డు కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు అన్నీ పూర్తిగా ఉచితమని తెలిపారు. 14వ తేదీ వరకు మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు : ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జేమ్స్ ఆసుపత్రిలో జిల్లాలోని మహిళలు అందరకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రవీణ్ తెలిపారు. ఈ వైద్య శిబిరాల్లో జిల్లాలోని మహిళా ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు, మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.