కోవేక్సిన్ టీకాకు 114 కేంద్రాలు ఏర్పాటు..


Ens Balu
4
Srikakulam
2021-03-09 15:25:01

కోవిడ్ వేక్సినేషన్ టీకాను వేసేందుకు జిల్లాలో 114 కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్   పేర్కొన్నారు.  ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇందులో 105 ప్రభుత్వ ఆసుపత్రులు ( ప్రాథమిక, సామాజిక, పట్టణ, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు) తో పాటు 9 ఆరోగ్య శ్రీ అనుబంధ ప్రైవేటు ఆసుపత్రులలో టీకాను పొందవచ్చని చెప్పారు.  ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ టీకాను ఉచితంగా పొందవచ్చని, అదే ప్రైవేటు ఆసుపత్రులలో ఐతే రూ.250/-లు ఒక డోస్ నకు చెల్లించి ఈ వ్యాక్సినేషన్ పొందవచ్చని ఆయన స్పష్టం చేసారు. 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45-59 మధ్య వయస్సు కలిగి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరూ కోవిడ్ వేక్సిన్ పొందేందుకు అర్హులని చెప్పారు. వ్యాక్సిన్ చేయించుకునేందుకు వచ్చేవారు ముందుగా వారి వివరాలను https://www.covin.gov.in ఆన్ లైన్ పోర్టల్ నందు నమోదు చేసుకొని తగిన గుర్తింపు వివరాలతో కూడిన ఐడెంటిటీ ప్రూఫ్ లతో వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి టీకాను పొందవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైన అక్కులపేట, అక్కుపల్లి, అచ్యుతాపురం, బైదలాపురం, బత్తిలి, భామిని, బిట్టివాడ, బొద్దాం, బుడితి, బూరాడ, చొర్లంగి, దండుగోపాలపురం, దూసి, గంగువాడ, గోవిందపురం, గుప్పిటిపేట,కింతలి, కొత్తపల్లి, కురిగాం, నిమ్మాడ, పాతర్లపల్లి, రావాడ, రాజాపురం, రెంటికోట, సరుబుజ్జిలి, సిరిపురం, శ్రీకూర్మం, సైరిగాం, తాడివలస, తొగరాం, ఉర్లాం, వీరఘట్టం, వెంకటాపురం, అన్నవరం, బాలేరు, బాతువ, బట్టిగల్లూరు, బోరుభద్ర, బుడుంబోకాలనీ, చాపర, గుత్తావిల్లి, కరజాడ, కొలిగాం, కొర్లాం, కుసిమి, మాకివలస, యం.సింగుపురం, మండాకురిటి, మర్రిపాడు, యం.యస్.పల్లి, నౌపడ, బూర్జ, జి.సిగడాం, హిరమండలం, జలుమూరు, కంచిలి, కె.కొత్తూరు, యల్.యన్.పేట, లావేరు, మందస, మెళియాపుట్టి, నందిగాం, పోలాకి, ఆమదాలవలస, సంతబొమ్మాళి, సంతకవిటి, సారవకోట, తిలారు, వజ్రపుకొత్తూరు, కళింగపట్నం, బోరివంక, దోన్ భాయి, వంగర, పొగిరి, పొన్నాడ, గార, మురపాక, ఎచ్చెర్ల, సింగుపురం, బెలగాంలలో ఉచితంగా టీకాను పొందవచ్చని చెప్పారు. వీటితో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అయిన హరిపురం, నరసన్నపేట, పొందూరు, రణస్థలం, సీతంపేట, కోటబొమ్మాళి, కొత్తూరు, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పాతపట్నం, పలాస, సోంపేట మరియు అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్  హెల్త్  సెంటర్లయిన ఇచ్ఛాపురం, పాలకొండ, టెక్కలి, ఐ.ఏ.నాయుడు కాలనీ, మెట్టకీవలస మరియు శ్రీకాకుళం, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాయిన పలాస, గుజరాతీపేట, ఆదివారం పేట, బర్మాకాలనీ, దమ్మలవీధి, ఏరియా ఆసుపత్రులయిన పాలకొండ,రాజాం కేంద్రాలలో కోవిడ్ వేక్సినేషన్ టీకాను ఉచితంగా పొందవచ్చని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. అలాగే ఆరోగ్యశ్రీ అనుబంధ ప్రైవేటు ఆసుపత్రులయిన బగ్గు సరోజిని దేవి ఆసుపత్రి, సింధూర, కిమ్స్ సాయి శేషాద్రి, జి.ఎం.ఆర్.వరలక్ష్మీ, అమృత, జెమ్స్, డా.గొలివి, పి.వి.యస్.రామ్మోహన్ రావు, రిమ్స్ ఆసుపత్రిలోని నెఫ్రో ప్లస్ నందు రూ.250/-లు చెల్లించి వేక్సిన్ పొందవచ్చని, ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని   కోరారు.