వేక్సిన్ వేయించుకున్న ఎన్నికల పరిశీలకులు..


Ens Balu
5
Visakhapatnam
2021-03-11 20:35:30

విశాఖపట్నం మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ కుమార్ కోవిడ్ వ్యాక్సిన్  మొదటి డోస్ వేయించుకున్నారు. గురువారం విమ్స్ ఆసుపత్రిలో ఆయన మొదటి డోస్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ నిబంధనల మేరకు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కోరనా వైరస్ ను పూర్తిగా నియంత్రించడానికి ప్రజలకు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. అదేవిధంగా వైద్యుల సూచనల మేరకు ప్రతీ ఒక్కరూ మాస్కు ధరిస్తూ, సామాజిక దూరం పాటించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కరోనా ఫ్రీ రాష్ట్రంగా మారేంతవరకూ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, కరోనా వ్యాక్సిన్ పై అపోహలు వీడి అందరూ కరోనా వేక్సిన్ వేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విమ్స్ సంచాలకులు సత్య వరప్రసాద్, తదితరులు ఉన్నారు.