విశాఖలో విద్యార్ధులకు కరోనాపై మంత్రి ఆరా..


Ens Balu
5
Visakhapatnam
2021-03-13 17:09:08

విశాఖలోని గోపాలపట్నం పాఠశాలలో విద్యార్ధులకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయంపై డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. విద్యార్ధుల పరిస్థితి ఎలా వుందనే కోసంణంలో విశాఖలో అధికారులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా నియంత్రణ చర్యలు పాటించడంతోపాటు, విద్యార్ధులకు కరోనా రేపిడ్ టెస్టులు చేయించాలని డిఎంహెచ్ఓ ఎంఎస్ సూర్యనారాయణతో ఫోన్ లో మాట్లాడి ఏ విధమైన చర్యలు తీసుకున్నారో అడిగి తెలుసుకున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి కింగ్ జార్జి ఆసుపత్రిలో ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేశామని ఈ విషయంలో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. మందులు, వైద్యులు, సిబ్బంది అందుబాటులోనే ఉన్నారన్నారు. పాఠశాలలకు దగ్గర్లో ఉన్న పీహెచ్సీల నుంచి పాఠశాల విద్యార్ధుల నుంచి శాంపిళ్లను సేకరిస్తున్నామని చెప్పారు. తీసుకున్న శాంపిళ్లను తక్షణమే పరీక్షలు నిర్వహించి రిపోర్టులు వచ్చిన వారిని ఐసోలేషన్ లో పెట్టాల్సిందిగా కూడా మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. సామాజిక దూరం పాటిస్తూ, విద్యార్ధులతో కూడా మాస్కులు ధరించేలా ఉపాధ్యాయులు చైతన్యం తీసుకురావాలని సూచించారు. ప్రజలు కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు.