మీడియా ప్రతినిధులకు కోవిడ్ టీకా..


Ens Balu
4
Srikakulam
2021-03-19 15:22:41

శ్రీకాకుళం జిల్లాలో  మీడియా ప్రతినిధులకు టీకా కార్యక్రమం ప్రత్యేకంగా ప్రారంభం అయింది. కోవిడ్ 19 టీకాను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ చొరవతో జర్నలిస్టులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాటు చేసారు. శుక్రవారం ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రతీ రోజు శ్రీకాకుళం నగరంలో బర్మా కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రంలో టీకా అందిస్తారు. టీకా పొందుటకు జర్నలిస్టులు విధిగా ఆధార్ కార్డులతో సహా టీకా కేంద్రానికి వెళ్ళాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ కోరారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 నుండి 59 సంవత్సరాల వయస్సుగల వారికి టీకా ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో కోవాక్సిన్, కోవిషీల్డు వాక్సిన్ అందుబాటులో ఉందని ఆయన చెప్పారు. టీకా పొందుటకు అర్హమైన వ్యక్తిగా వైద్యులు ధృవీకరించాలని తెలిపారు.