ప్రభుత్వాసుపత్రి కాన్పులపై ప్రజల్లో చైతన్యం తేవాలి..
Ens Balu
2
Kakinada
2021-03-19 16:35:02
ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పు అయిన వారికి ఆరోగ్య ఆసరా పథకం ద్వారా రూ.4వేల రూపాయలు అందజేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తెలిపారు. ప్రభుత్వం అందించే ఈ పథకంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జేసి కీర్తి చేకూరి ఆరోగ్యశ్రీ జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశాన్ని ఆరోగ్యశ్రీ ఇతర వైద్య అధికారులతో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ఆరోగ్యశ్రీ ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదులపై జేసి సమీక్షించారు. సందర్భంగా జేసి మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ సంబంధించి పేషెంట్ ల వద్ద నుంచి తీసుకున్న సొమ్మునకు పది రెట్లు పెనాల్టీ వసూలు చేయాలని ఆరోగ్య శ్రీ అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ గుర్తింపు పొందిన ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేయని వారిపై కఠిన చర్యలు తప్పవని ఆమె తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులలో నార్మల్ డెలివరీ అయిన వారికి ఆరోగ్య ఆసరా పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసుపత్రికి వెళ్లే టప్పుడు ప్రజలు తమ వెంట తప్పనిసరిగా వారికి ఇవ్వబడిన ఆరోగ్యశ్రీ గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలని జెసి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి (ఇన్చార్జి)డా. ప్రసన్న కుమార్, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా.పి రాధాకృష్ణ, రంపచోడవరం కోఆర్డినేటర్ డా పి.ప్రియాంక, జిల్లా మేనేజర్ కే నవీన్ పాల్గొన్నారు.