ఆర్డీ ఆఫీసు గొడవ వీడియో బయటకొచ్చింది..?


Ens Balu
4
విశాఖపట్నం
2021-03-19 21:54:09

నాభూ...తో నా భవిష్యత్ అన్న కామెడీ కింగ్ బ్రహ్మానందం డైలాగు మీకు గుర్తుందా మీకు..పోన్లేండీ గుర్తులేకపోతే గురువారం వైద్య ఆరోగ్యశాఖ ఆర్డీ కార్యాలయంలో ఓ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ కి బి.సెక్షన్ సూపరింటెండెంట్ కు తారా స్థాయిలో గొడవ, అరపులు, కేకలు, బూతు పురాణం..మొత్తం విన్నవారు చెబుతారు..చెప్పడమేంటి ఆ గొడవ జరిగిన తరువాత అదే విషయం డిప్యూటీ డైరెక్టర్ వరకూ వెళ్లినా...గొడవ జరిగింది ఏం చేయగలం..నేనేమో డిప్యూటేషన్ అధికారిని అన్నట్టు..ఏమీ జరగనట్టు ఇరువురి మధ్య జరిగిన గొడవనూ జస్ట్ సినిమా చూసినట్టు చూసివెళ్లారు డిప్యూటీ డైరెక్టర్..సిహెచ్ శ్రీనివాసకుమార్. శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయంలో ఈ గొడవ విషయమై విచారణ జరిగినా ఇరువురునీ ఏమీ అనకుండా..ఆ విషయం మీడియా అడిగినా సమాధానం చెప్పకుండా చాలా తెలివిగా వ్యవహరించారు. దీంతో గొడవ పడినవారు, గొడవ ఎందుకు జరిగిందో తెలుసుకోవడానిక వచ్చిన వారూ మొత్తం మిలాఖత్ అయిపోయారని తేట తెల్లమైంది..ఇందులో కొత్తమేముంది అనుకుంటున్నారా..ఇక్కడేవుంది అసలు ట్విస్టు.. ఆ గొడవ జరిగిన తంతు మొత్తాన్ని ఇదే కార్యాలయంలో ఒక వర్గం వారు వీడియో తీసి దానిని మీడియాకి అందించారని సమాచారం అందుతుంది. ఈవిషయంపై విచారణ చేసినా, డిడి వీరిరువురినీ ఏమీ అనరని ముందుగానే గమనించి ఆ గొడవకు సాక్ష్యాన్ని మీడియాకి లీక్ చేశారనే ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఒక ప్రభుత్వ కార్యాలయంలో గొడవ జరిగితే సూపరింటెండెంట్ స్థాయి అధికారి చక్కదిద్దాలి. అలాంటి ఆయనే మరో సీనియర్ అసిస్టెంటుతో బాహా బాహికి దిగి, ఆపై బూతు పురాణం మొత్తం వల్లెవేసి, తీరా డిడి వచ్చిన తరువాత ఏమీ తెలియనట్టు ఆ అధికారి ముందు వ్యవహరించిన  నాటకీయ పరిణామాణాలు  ఆర్డీ కార్యాలయంలో బాగా పండాయి. అప్పటి వరకూ వీడియోని బయటపెట్టని వారు తీరా ఆర్డీ వారిని ఏమీ అనకపోవడం, కనీసం మందలించకపోవడంతో ఆ గొడవ వీడియో బయట పడిందనే ప్రచారం అందరికీ ఉత్కంఠకు గురిచేస్తుంది. అసలు గొడవ పడిన విషయాన్ని సదరు డిడి ఎందుకు ద్రువీకరించలేదు.. ఎందుకు వారిని మందలించలేదు..దీనిపై ఎందుకు వివరణ కోరలేదు..చేసిన విచారణ ఎందరుకు రాష్ట్ర అధికారులకు పంపలేదనే కారణాలన్నీ బయటకొచ్చాయి. దీనితో ఆ గొడవ వీడియో కాస్తా డిహెచ్ వరకూ వెళితే ఇటు కార్యాలయ అధికారుల, అటు ఆర్డీ, మొత్తం రాష్ట్ర అధికారుల దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కావాలనే ఈ విషయాన్ని ఒక వర్గం రాష్ట్రవ్యాప్తం చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తుంది.. కానీ ఆర్టీ కార్యాలయంలో అసలు ఏమీ జరగలేదనే విషయాన్ని మీడియాకు వివరిచడంలో అందరు సిబ్బంది బాగా నటించగలిగారు. అందరూ వెజ్ తినేవారైతే..గంపలో దమ్ బిర్యానీ ఎవరు తిన్నారబ్బా అన్నట్టు..అసలు జరిగిన గొడవను తీసిన ఆ తెరవెను వ్యక్తి ఈ విషయాన్ని ఏ స్థాయిలో అధికారులకు తెలియజేస్తాడనేది ఆశక్తిరంగా మారింది.. ఏం జరుగుతుందనేది వేచిచూడాలి మరి..!