పూరీ జగన్నాథ్ ప్రభు భోగ్‌లో వంటకాల చరిత్ర తెలుసా?


Ens Balu
178
Puri
2023-06-18 10:31:47

పూరీ జగన్నాథ స్వామివారి ఆలయం ఈ పేరు చెబితే గుర్తొచ్చేది ఒడిసాలోని పూరీ..అంతేకాదు ఈ స్వామివారి ఆలయం, ఇక్కడ స్వామివారి రూపం..శ్రీవారికి నివేదించే ప్రసాదం కూడా అందే విశేష ప్రాచుర్యం పొందింది. అన్ని రకాలు ప్రసాదాలు స్వామివారి నిత్యం తయారు చేసి సమర్పిస్తారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 56 రకాల ప్రసాదాలు ప్రతినిత్యం నైవేధ్యంగా పెట్టడం ఇక్కడి ఆలయంలోని ప్రత్యేకత. అంతకంటే మరింతగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే..ఈ మొత్తం ప్రసాదాలన్నీ కుండలోనే తయ తయారు చేస్తారు. ప్రతీరోజూ కొత్తవాటిలోనే తయారు చేస్తారు. ఒడిసా బాషలోని వివిధ రకాల పేర్లను కూడా స్వామివారి నైవేద్యానికి ఉంటాయి. స్వామివారికి పెట్టే నైవేధ్యాన్ని భోగ్ అని పిలుస్తారు. స్వామివారి చరిత్రకి ఎంత ప్రాముఖ్యత వుంటుందో అదే విధంగా స్వామి స్వీకరించినట్టుగా చెప్పే ఈ 56 రకాల నైవేద్యాలు(ప్రసాదాలు)కి అంతే చరిత్ర వుంది. ఇందులో కొన్ని పేర్లు మనకి తెలిసినట్టుగా కూడా ఉంటాయి. ఒక్కో ప్రసాదానికి ఒక్కో విశిష్టత ఉంది.

1) భక్త (అన్నం), 2) సూప్ (పప్పు), 3) ప్రలేహ్ (చట్నీ), 4) సాదికా (కూర), 5) దధిషకాజా (పెరుగు కూర), 6) సిఖరిణి (సిఖ్రాన్), 7) అవలేహ్ (షర్బత్) ),8) బాల్కా (బాటి), 9) ఇక్షు ఖేరిని (మురబ్బా (చెరకు ఖేరిని)), 10) త్రికోనా (చక్కెరతో కూడినది), 11) బటక్ (వడ), 12) మధు సిరిపాక్  (మఠారి), 13) ఫెనికా (ఫెని), 14) పరిష్టరచ్ (పూరి), 15) శతపత్ర (ఖజాల), 16) సధిద్రక్ (ఘేవర్), 17) చక్రం (మల్పువా), 18) చిల్దికా (చోళ), 19) సుధాకుండలికా (జలేబి), 20) ధృతపూర్ (మేసు), 21) వాయుపూర్ ( రస్గుల్లా) 22) చంద్రకళ, 23) దధి (మహారాయత), 24) స్థూలి (తులి) 25) కర్పూర్నది (లుంగ్‌పురి), 26) ఖండ్ మండల్ (ఖుర్మా), 27) గోధూమ్ (గంజి), 28) పరిఖా, 29) సుఫ్లధయ ( సోంపు కలిగిన), 30) దధీరూప్ (బిల్సారు), 31) మోదక్ (లడ్డూలు), 32) శాక్ (సాగ్) 33) సౌధన్ (అధానౌ ఊరగాయ), 34) మందక (మోత్), 35) పాయస్ (ఖీర్), 36) పెరుగు , 37) గోగృత్, 38) హయాంగ్‌పీనం (వెన్న), 39) మలై, 40) కుపిక 41) పర్పట్ (పాపాడ్), 42) శక్తిక (సిరా), 43) లసిక (లస్సీ), 44) సువత, 45) సంఘయ (మోహన్), 46) సుపారీ, 47) సీత (యాలకలతో చేసిన), 48) పండు, 49) తాంబూలం, 50) మోహన్ భోగ్, 51) 
లవణ, 52) కషాయం , 53) మధుర్(తీపు) , 54) తీక్ట్ (చేదు), 55) కటువు(పులుపు), 56) ఆమ్లా(వగరు).
 
పూరీ జగన్నాథస్వామివారి దగ్గరకు వచ్చి ఆయనను దర్శించుకున్న భక్తులు ఈ యొక్క ప్రసాదాల జాబితాను నోట్ చేసుకొని చాలా వరకూ ఇందులోని రకాలను తయారు చేసి స్వామివారికి వారి వారి ప్రాంతాల్లో నైవేద్యంగా కూడా సమర్పిస్తుంటారట. అంతేకాకుండా స్వామికి కోరిక కోర్కెలు తీరితే ఈరకంగా నైవేద్యం సమర్పిస్తామని కూడా అత్యధిక మంది భక్తులు మొక్కులు మొక్కుకుంటారనే విధానం కూడా ప్రాచుర్యలంలో ఉంది. ఇక్కడ పూరిజగన్నాథస్వామివారు విష్ణుమూర్తి అవకతారంగా చెబుతారు. దేశంలోని విష్ణు ఆలయాల్లో కెల్లా పూరీ జగన్నాథస్వామివారి రూపం, ప్రసాదంగా చెప్పబడే నైవేద్యం రెండూ ఎంతో ప్రాచుర్యం పొందాయి..!