ఆ వినాయకుడికి కోర్కెలన్నీ చెవిలోనే చెప్పాలి..


Ens Balu
2
Bikkavolu
2021-03-03 13:17:07

ఆ వినాయకుడు చెవిలో ఏది చెబితే అది జరుగుతుంది..భక్తులు కోరిన కోర్కెలన్నీ తీరుస్తాడు..ఈ మాట ఒకరు ఇద్దరు కాదు వందల, వేల మంది భక్తులు చెప్పేమాట. ఇంతకీ ఎక్కడవుంటాడు ఆ వినాయమకుడు అంటే తూర్పుగోదావరి జిల్లా, బిక్కవోలుని శ్రీ లక్ష్మీగణపతిగా భక్తులకు వరాలు ఇస్తూ విరాజిల్లుతున్నాడు ఈ స్వామి.. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విజ్ఞం కురుమేదేవా, సర్వ కార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే ఈవినాయక స్వామి కోరిన కోరికలు తీరుస్తాడు. విజ్ఞానలన్నిటికీ అధిపతి అగ్రజుడుగా అగ్ర పూజలందుకున్న గణేశుడిని నిత్యం దేవతలందరూ ఆరాదిస్తారంటే ఆయన ఎంతటి శక్తి వంతమైన దేవుడనేది వేరేగా చెప్పాల్సిన పనిలేదు.. అలాంటి వినాయకుడు అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు. స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రాలలో ఒకటైన  బిక్కవోలు శ్రీ లక్ష్మి గణపతి దేవాలయం తూర్పుగోదావరి జిల్లాకు ఆధ్యాత్మికంగా విశేషంగా కీర్తిని తీసుకొచ్చింది. ఇక్కడి వినాయకుడు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు. ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మిక. క్రీ శ 840 సంవత్సరంలో చాళుక్యులు ఈ ఆలయం నిర్మించినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండే శాసనాల ద్వారా ఇది ఎంతటి పురాతన ఆలయమో అర్ధమవుతుంది. నిజానికి ఇక్కడున్న ఆలయం భూమిలోనే ఉండేదట. 19 వ శతాబ్దంలో ఒక భక్తుడికి వినాయకుడు కలలో కనిపించి తన ఉనికిని చాతినట్టుగా ప్రచారంలో ఒక కధ వినిపిస్తుంది. అప్పుడా భక్తుడు గ్రామస్తులకు ఆ విషయం చెప్పిఅ ఆలయాన్ని తవ్వించాడట. ఆ తరువాత వినాయకుడు బయటపడ్డాడని అప్పటి నుంచి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదనీ చెబుతున్నారు. భూమిలో నుండి బయటపడిన తరువాత వినాయక విగ్రహం పెద్దదయిందని భక్తులే చెబుతుంటారు. ఈ వినాయకుడి ఆలయానికి ఎక్కడెక్కడి నుంచే భక్తులు వచ్చి తమ కోరికలను విన్నవించుకుంటున్నారు. విఘ్నేశ్వరుడి చెవిలో తమ కోరికలను చెప్పుకొని ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అంతే కాకుండా నందీశ్వరుడిని, భూలింగేస్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ రాజరాజేశ్వర ఆలయం కూడా ఉంది. స్వామి దర్శనం కోసం వచ్చిన వారంతా అమ్మవారికి కూడా పూజలు చేస్తారు. ఈ ఆలయం లోకి వెళ్ళగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు చెబుతున్నారు. వీరభద్రుడు, సుబ్రమణ్య స్వామి కొలువై ఉన్నారు. ప్రతీ సంవత్సరం గణపతి నవరాత్రులతో పాటు సుబ్రమనయేశ్వర ఉత్సవాలు కూడా జరుగుతాయి. పూజలు, పారాయణాలు,దీపోత్సవాలను ఇలా అన్ని కార్యక్రమాలను కన్నుల పండువగా తిలకించవచ్చు. ఇక్కడ గణపతి హోమమ చేయిస్తే సాక్షాత్తూ ఆ కుటుంబానికి గణపతి అండగా ఉంటాడని భావిస్తారు. రాజమండ్రి నుంచి గాని, అనపర్తి నుంచి గాని బిక్కవోలుకు చేరుకోవచ్చు. ప్రత్యేకంగా వెళ్లేవారు కార్లు, ఆటోలు, జీపుల ద్వారా స్వామి దగ్గరకు వెళ్లి వారి కోర్కెలు చెప్పి వస్తుంటారు. అవితీరిన తరువాత మొక్కులు కూడా చెల్లించుకుంటారు. అంతటి మహిమ కలిగిన బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని ప్రతీ ఒక్కరూ దర్శించుకుంటారని ఆశిద్దాం..!