తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు


Ens Balu
4
Tirumala
2022-04-26 12:59:16

తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు మంగ‌ళ‌వారం ఘనంగా ప్రారంభ మయ్యాయి. మే 14వ తేదీ వరకు 19 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. మే 5వ తేదీన శ్రీ భాష్యకార్ల సాత్తుమొర జరుగనుంది. భగవద్‌ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ''శ్రీభాష్యం'' పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు. భాష్యకారుల ఉత్సవాల మొదటిరోజున ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయర్‌స్వామి, పార్‌ప‌త్తేదార్  గుర్ర‌ప్ప త‌దిత‌రులు పాల్గొన్నారు.