సీఎం జగన్‌ను కలిసిన నీతి ఆయోగ్‌ బృందం


Ens Balu
3
Tadepalli
2022-05-06 16:28:57

యూఎన్‌డీపీ భాగస్వామ్యంతో ప్రణాళికా విభాగంలో సుస్ధిర ఆర్ధిక ప్రగతి కోసం నిర్ధేశించుకు న్న లక్ష్యాల సాధనపై మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటుచేయనున్న ప్రభుత్వం, ఈ అంశంపై సీఎం  వైఎస్‌ జగన్‌తో సమావేశమై చర్చించిన నీతి ఆయోగ్‌ సభ్యుల బృందం. ఈ సమావేశంలో పాల్గొన్న నీతి ఆయోగ్‌ సలహాదారు (ఎస్డీజీ) సాన్యుక్త సమద్దార్‌ (ఐఏఎస్‌), చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ప్రణాళికా శాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్‌కే విజయ్‌కుమార్, యూఎన్‌డీపీ (ఇండియా) ముఖ్య సలహాదారు మీనాక్షి కతెల్, నీతి ఆయోగ్‌ ఎస్డీజీ ఆఫీసర్స్‌ అలెన్‌ జాన్, సౌమి గుహ, యూఎన్‌డీపీ డిప్యూటీ రెసిడెంట్‌ రెప్రజెంటెటివ్‌ డెన్నిస్‌ కర్రీ తదితరులు పాల్గొన్నారు.