తిరుమలలో వేసవి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారి సౌకర్యార్థం జూన్ 30వ తేదీ వరకు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు టిటిడి ప్రకటించింది. అయితే, ప్రతి మంగళవారం నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవాటికెట్లను జూన్ వరకు ఆన్లైన్ లో విడుదల చేయడంతో భక్తులు బుక్ చేసుకున్నారు. ఆన్లైన్ లో సేవాటికెట్లు బుక్ చేసుకున్న వారిని అష్టదళపాదపద్మారాధన సేవకు అనుమతించాలని టిటిడి నిర్ణయించింది. అదేవిధంగా, అడ్వాన్స్ బుకింగ్ లో జూన్ 30వ తేదీ వరకు తిరుప్పావడ సేవా టికెట్లు గలవారు ఆయా తేదీల్లో బ్రేక్ దర్శనానికి రావాలని కోరింది. లేనిపక్షంలో సేవాటికెట్ రీఫండ్ పొందాలని టిటిడి భక్తులను కోరుతోంది. ఈ అవకాశాన్ని శ్రీవారి భక్తులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేకోవాలని మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో సూచించింది.