ఆ విద్యార్ధు ఇంగ్లీషుకి సీఎం జనగ్ ఫిదా..


Ens Balu
2
Tadepalli
2022-05-19 16:45:33

కాకినాడ జిల్లా, తొండంగి మండలం, బెండపూడి హైస్కూలు విద్యార్ధినిలు ఇంగ్లీషు మాటలకు సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి ఫిదా అయిపోయారు. విద్యార్ధులంతా అమెరికన్ యాక్సెంట్ లో ఇంగ్లీషులో మాట్లాడుతుంటే.. సీఎం జగన్ వారిని ఉత్తేజ పరుస్తూ విద్యార్ధులందరితోనూ ముచ్చటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ స్థాయిలో విద్యార్ధులు ఇంగ్లీషు నేర్చుకోవాలనే లక్ష్యంతో అన్ని పాఠశాలల్లో సిబీఎస్సీ సిలబస్ ను అమలు చేయడంతోపాటు, ప్రత్యేక విద్యావ్యవస్థను వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. బెండపూడి విద్యార్ధులను సీఎం నేరుగా తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడటం ఇపుడు రాష్ట్రంలోనే కాదు..దేశంలోనే హాట్ టాపిక్ అవుతోంది.