మే26న వయోవృద్ధుల కోటా టోకెన్లు విడుదల
Ens Balu
3
Tirumala
2022-05-24 10:51:13
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి కోసం జులై నెల ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను మే 25వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. కాగా, ఈ విధంగా బుక్ చేసుకున్న వారిని ప్రస్తుతం ప్రతిరోజూ ఉదయం 10 గంటల స్లాట్లో దర్శనానికి అనుమతిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుండి ఉదయం 10 గంటలకు బదులుగా మధ్యాహ్నం 3 గంటల స్లాట్లో అనుమతిస్తారు. ఈ విషయాన్ని గమనించాలని టిటిడి కోరుతుంది. ఆగస్టు నెలకు సంబంధించిన గదుల కోటా మే 26వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల కానుంది. ఈ అవకాశాన్ని వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని టిటిడి మీడియాకి విడుదల చేసిన ప్రకటన ద్వారా కోరుతోంది.