ఆ పరీక్షలో మహిళా పోలీసులంతా పాస్
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 6
                            
                         
                        
                            
Tadepalli
                            2022-06-01 14:42:31
                        
                     
                    
                 
                
                    రాష్ట్రవ్యాప్తంగా 14849 మంది గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకి ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో 366 మంది అభ్యర్ధినిలు మినహా 14483 మంది పాస్ అయినట్టు రాష్ట్ర డీజీపీ కార్యాలయం తెలియజేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మహిళా పోలీసులు ఈ పరీక్షలు రాశారు. అయితే ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులను 33నెలల తరువాత సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తున్న తరుణంలో కోర్టుకేసుల కారణంగా ఈ ప్రక్రియ ఒక్క మహిళా పోలీసుల విషయంలోనే నిలిచిపోయింది. ఈ తరుణంలోనే హోంశాఖ మహిళా పోలీసులు అప్పుడెప్పుడో రాసిన పరీక్షల ఫలితాలను ఇపుడు విడుదల చేయడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.