రూటు మార్చిన బెంగాల్ టైగర్..


Ens Balu
3
ఏలేశ్వరం
2022-06-07 16:41:52

ప్రత్తిపాడు నియోజకవర్గంలో గత 19 రోజులుగా చిక్కకుండా ముప్పు తిప్పలు పెడుతున్న రాయల్ బెంగాల్ టైగర్ ఇపుడు ఏలేశ్వరం రిజర్వాయర్ ప్రాజెక్టు దిశగా రూటుమార్చినట్టుగా పులి నడిచిన ముద్రల ఆధారంగా అటవీశాఖ అధికారులు ద్రువీకరిస్తున్నారు. పెద్దిపాలెం గ్రామ పరిసరాల్లో పొట్టి మెట్ట మీద పులి సంచరిస్తున్న ఆనవాళ్లను అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే తాజాగా మంగళవారం సాయంత్రానికి పులిసంచరించిన ప్రదేశాలను పులి అడుగులు వేసిన ముద్రల ఆధారంగా దాని జాడ ఏలేరు రిజర్వాయర్ ప్రాంతానికి దారితీసినట్టుగా చెబుతున్నారు. అయితే గత రెండు వారాలకు పైనే అడవిలో సంచరించిన పులి ఇపుడు దాహార్తిని తీర్చుకోవడానికే ఏలేరు రిజర్వాయర్ ప్రాంతానికి దారిమళ్లి వుంటుంద అటవీ అధికారులు భావిస్తున్నారు.  పొదురపాక, పాండవుల పాలెం మధ్య ఉన్న పొట్టి మెట్ట ప్రాంతాలతోపాటు, గతంలో పులి సంచిచన ప్రదేశాలను కూడా అటవీశాఖకు చెందిన 120 మంది సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే పులి అడుగులు అక్కడి రెండు మూడు ప్రాంతాల్లో కూడా కనిపించడంతో పులి తన రూటు ఏలేశ్వరం రిజర్వాయర్ ప్రాంతాల వరకూ దారితీసినట్టుగా భావిస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో పులి జాడను మాత్రం కనిపెట్టలేకపోతున్నారు అటవీశాఖ అధికారులు. లింగంపర్తి ఏరియాను దాటి శివారు ప్రాంతాల్లో సంచరించే అవకాశాలు ఆ దారిగుండా కనిపిస్తున్నాయని మాత్రం చెప్పుకొస్తున్నారు. బెంగాల్ టైర్ రోజుకో రూటులో ప్రయాణిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రాంతంలో దర్శనమిస్తుందో తెలియని పరిస్థితుల్లో ప్రత్తిపాడు నియోజవకర్గ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు.