ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండల అధికారులు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఏర్పాటు చేసే సమావేశాలకు, ఆ పేరుతో చేసే కాలయాపనకు అడ్డుకట్టవేసింది. సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఉండాలని, ఆ సమయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శితో సహా అన్నిశాఖల సిబ్బంది పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని ఆదేశించింది. ఆ సమయంలో మండలకేంద్రాల్లో ఎలాంటి సమావేశాలు, క్షేత్రస్థాయి పనులు సిబ్బందికి ఆపాదించవద్దని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి ఏదైనా మండల కేంద్రంలో సమావేశం పెడితే ఒక పూటంతా రూరల్ జిల్లాలో గ్రామసచివాలయ సిబ్బందికి, నగర ప్రాంతంలో వార్డు సచివాలయ సిబ్బంది సమయం వ్రుధా అయ్యేది. అంతేకాకుండా మండల కేంద్రం నుంచి సచివాలయానికి వచ్చే సమయంలో ప్రయాణానికే చాలా ఎక్కువగా వ్రుధా అవుతోంది. దీనిని ద్రుష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ప్రతీరోజూ సచివాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమానికి ఆటంకం లేకుండా అన్నిశాఖల సిబ్బంది సచివాలయాల్లోనే ఉండాలని.. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయశాఖ సంచాలకులు GVWW & VSWS GWSUICOOR /158/2021/GW5/14885/ dt.19.08.2021 పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులు అనుసరించి ముఖ్యమైన సమావేశాలుంటే మధ్యాహ్నం లోపుగానే నిర్వహించాల్సి వుంటుంది. ఈ ఆదేశాలను అటు వార్డు సచివాలయాలు, ఇటు గ్రామసచివాలయాలకే కాకుండా సచివాలయంలో పనిచేసే సిబ్బందికి చెందిన అన్ని శాఖల సిబ్బందికీ, మండల అధికారులకు ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఇప్పటి వరకూ కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శిలు బయోమెట్రిక్ వేసి మండల అధికారులు ఆదేశించే కార్యక్రమాలకు వెళ్లిపోతూ ఉండేవారు. ఇకపై ఆ ఆటలు చెల్లకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖచ్చితంగా మధ్యాహ్నం3 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించాల్సి వుంటుంది. 33 నెలలు సర్వీసు ప్రొబేషన్ పూర్తిచేసుకొని..సర్వీస్ రెగ్యులైజేషన్ కి దగ్గరవుతున్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించిందనే సంకేతాలు ప్రస్తుతం జారీ చేసిన ఆదేశాలతో అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామసచివాలయంలో అన్ని శాఖల సిబ్బంది ప్రజలుకు అందుబాటులోకి రావడంతోపాటు, ఆయ సమస్యల పరిష్కారానికి కూడా మార్గం సుగమం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూడాలి ఈ ప్రత్యేక ఉత్తర్వులు ఏ స్థాయిలో ఫలితాలనిస్తాయనేది.