కేబినెట్లో సచివాలయ ఉద్యోగుల ఊసేది


Ens Balu
5
తాడేపల్లి
2022-06-25 05:46:31

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా మంత్రిమండలిని విస్తరించిన తరువాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో సుమారు 42 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ కి సంబంధించిన విషయం మాత్రం చర్చకు రాలేదు. ఇప్పటి వరకూ సచివాలయ ఉద్యోగులు 33నెలల పాటు సర్వీసు ప్రొబేషన్ ను చేస్తూ వస్తున్నారు. వాస్తవానికి వైఎస్సార్సీపీ సర్కారు సచివాలయ ఉద్యోగులకు రెండేళ్లు ప్రొబేషన్ పూర్తిచేసుకోగానే వారి సర్వీసులు రెగ్యులర్ చేసి వారికి పేస్కేలు అమలు చేస్తామని చెప్పింది. ఆ తరువాత కరోనా రావడంతో రెండేళ్ల ప్రొబేషన్ ను కాస్తా 33 నెలలకు పెంచి ఆగస్టు1 నుంచి కొత్తజీతాలు ఇస్తామని..దానికి సంబంధించిన ఫైలుపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సంతకాలు కూడా చేశారు. సీఎం ఫైలుపై సంతకాలు చేసి పదిరోజులు గడుస్తున్నా సదరు ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్స్ కి సంబంధించిన అంశంలో మాత్రం క్లారిటీ రాలేదు. సుమారు లక్షా 24వేల మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సర్వీసు ప్రొబేషన్ వ్యవహారం ఏడాదికి ఏడాది కాలం పొడిగిస్తూనే వస్తుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఒక ఫైలుపై సంతకాలు చేసిన 24 గంటల్లో ఆర్ధిక శాఖ జీఓ జారీచేస్తుంది. 

ఆపై వరుసగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన శాఖలు కూడా జీఓలు జారీచేస్తాయి. ఈ విధంగానే జరుగుతుందని సచివాలయ ఉద్యోగులంతా ఊహించుకున్నారు. ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ రెండేళ్లు పూర్తిచేసుకుని.. టెస్టులు పాసైన వారందరికీ వర్తింపచేస్తామని చెప్పిన మాటలు మాత్రం మాటలు గానే ఉండిపోయాయి. ముఖ్యమంత్రిస్థాయిలో నిర్ణయం తీసుకున్నతరువాత అదే విషయాన్ని కేబినెట్ లో చర్చించి సదరు ఫైలుకి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఊసేలేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల గొంతులో వెలక్కాయ్ పడ్డట్టు అయ్యింది. ప్రభుత్వం కేబినెట్ లో తమ అంశం కూడా చర్చించి సర్వీసు ప్రొభేషన్ విషయాన్ని ముగించి తమకు పేస్కేలు అమలు చేయడానికి లైన్ క్లియర్ చేస్తారని అంతాఆశించినా ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. ఇప్పటికే ఆగస్టు 1నాటికి ప్రొభేషన్ డిక్లరేషన్ అయిన తరువాత కొత్త జీతాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం..ముచ్చటగా మూడేళ్లు పూర్తిచేసినా చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని..తొలుత జూన్ నాటికి రెగ్యులర్ చేస్తామన్న ప్రభుత్వం దానిని ఆగస్టు1నాటికి మార్చిందని..ఇపుడు కేబినెట్ లో తమ ఉద్యోగాల సర్వీస్ ప్రొభేషన్ డిక్లరైజేషన్ కోసం నిర్ణయం తీసుకోకపోవడంతో ఆగస్టు నుంచి మళ్లీ అక్టోబరు 1 అంటే మూడేళ్లు పూర్తిచేసిన తరువాతే నిర్ణయం తీసుకుంటుందా అనే అనుమానాలను కూడా ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అదనంగా 9నెలల పాటు పేస్కేలు కోల్పోయిన ఉద్యోగులు.. పొగిడించిన రెండు నెలలతో మరింతగా పేస్కేలు కోల్పోతారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి మానస పుత్రిక గా పేరుగాంచిన గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఇప్పటి వరకూ ఏ ఒక్కటీ జరగలేదు. ఇపుడు సర్వీసు రెగ్యులైజేషన్, ప్రొభేషన్ డిక్లరేషన్ విషయంలోనూ అదే కాలయాపన చేస్తుందని మరోవైపు టీడీపీ ఆరోపణలు గుప్పిస్తున్నది. 

ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టుగానే పాలక ప్రభుత్వం కూడా తాత్సారం చేయడంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా వుంది. అయితే కొంత మందిఉద్యోగులు ప్రభుత్వం పెట్టిన పరీక్షలు పాస్ కాలేదని, వారందరికీ మరోసారి పరీక్షపెట్టి వారికి అందరికీ ఒకేసారి సర్వీసు ప్రొభేషన్ డిక్లేర్ చేస్తామని అంటున్నట్టుగా ప్రభుత్వ అధికారుల వద్దకు సమాచారం అందినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వంలోనూ లేనివిధంగా 33నెలలకు పైగా ప్రొభేషన్ చేయించడం, అదీ రెండవ శనివారాలు, ఆదివారాలు, మిగిలిన సెలవు రోజుల్లో ప్రత్యేక విధుల పేరుతో ఉద్యోగాలు చేసినా..ప్రభుత్వం గుర్తించకపోవడం, సకాలంలో సర్వీసులు రెగ్యులర్ కాకపోవడం తదితర పరిణాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందనేది..!