సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ క్లియర్


Ens Balu
5
Tadepalli
2022-06-25 12:40:06

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ ను డిక్లేర్ చేస్తూ..జీఓనెంబరు-5ను సచివాలయ శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ విడుదల చేశారు. ఈ జీవోతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు లక్షా 24వేలకు పైగా ఉద్యోగులకు రెగ్యులర్ పేస్కేలు అమలవుతుంది. అయితే ప్రభుత్వం వీరికి పీఆర్సీ కూడా అమలు చేసినట్టు ప్రకటించింది. సచివాలయ ఉద్యోగులు 33 నెలలు ప్రొబేషన్ తరువాత మాత్రమే ఈ జీఓను జారీ చేసింది. వాస్తవానికి అక్టోబరు1 2021నే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రెండేళ్లు సర్వీసు పూర్తయింది. కానీ 19శాఖలకు చెందిన సచివాలయ ఉద్యోగులకు రాష్ట్రప్రభుత్వం ఈజీఓ వర్తింపచేసింది. ఈ జీఓ ప్రకారం ఉద్యోగులు ఆగస్టు 1 నుంచి కొత్తగా పెరిగిన పేస్కేలు అందుకుంటారు. ప్రభుత్వ జీఓ ప్రకారం పంచాయతీ గ్రేడ్-5 కార్యదర్శిలకు రూ.23,120 నుంచి రూ.74,770 అదేవిధంగా మిగిలిన 18శాఖల ఉద్యోగులకు రూ.22,460 నుంచి రూ.72,810 మేరకు పేస్కేలు వర్తిస్తుంది. దీనికి హెచ్ఆర్ఏ, డీఏ పూర్తిస్థాయి జీతాలు ఉద్యోగులు అందుకుంటారు. కాగా ప్రభుత్వం విడుదల చేసిన జీఓను గ్రామసచివాలయశాఖలో పనిచేస్తున్న అన్నిశాఖలకు, డీఎస్సీ చైర్మన్, కలెక్టర్లు జారీచేసింది. ఇన్నేళ్లకు తమ సర్వీసు ప్రొబేషన్ క్లియర్ చేస్తూ.. పేస్కేలు వర్తింపచేయడం పట్ల గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.