సచివాలయ ఉద్యోగులపై అయోమయ బాంబ్


Ens Balu
4
తాడేపల్లి
2022-06-27 06:01:35

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులను జూలై నెలఖరు నుంచి క్రమబద్దీకరిస్తున్నామని, వారంతా ఆగస్టు ఒకటి నుంచి సరికొత్త పీఆర్సీతో కూడి పేస్కేసలు అందుకుంటారని జీఓనెంబ-5 విడుదల చేసినప్పటికీ ఏ ఒక్క ఉద్యోగిలోనూ ఆనందం లేదు సరికదా.. పూర్తిగా అయోమయంలో పడిపోయారు. ఇదేంటీ ఓప్రక్క ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్  చేస్తూ జీఓ ఇచ్చినా.. ఈ తేడా వార్తలు రాస్తున్నాన్నారేంటి.. అందులోనూ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ(ఈఎన్ఎస్), అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens live,న్యూస్ వెబ్ సైట్ www.enslive.net వాళ్లు విషయాన్ని ఇంతలా ఉద్యోగులకు అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారేంటి అనుకుంటున్నారా.. మీకు కూడా ఆ ఆ డౌట్ వచ్చంది కదా.. అలాఅయితే  ఈ స్టోరీ పూర్తిగా చదివితే మీకు కూడా సరిగ్గా బొమ్మ కనిపించే వాస్తవాలు తెలుస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసినపుడు ఉద్యోగుల సర్వీసును ప్రొబేషన్ ను డిక్లేర్ చేసే సమయంలో ఒక జీఓను విడుదల చేస్తుంది. ఆ జీఓను అనుసరించి ప్రతీ శాఖ ముఖ్య కార్యదర్శి మరోసారి ఉద్యోగుల సర్వీసు రూల్సు, పదోన్నతులు తెలియజేస్తూ.. వారి పేస్కేలుని నిర్ణయిస్తూ మరో జీఓరు జారీ చేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 19 శాఖల సిబ్బందిని ఒకే గొడుగు కిందికి తీసుకు వచ్చి, నగపరిధిలో వార్డు సచివాలయాలు, గ్రామ పరిధిలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఇలా ఏర్పాటు చేసినా.. నియామకాల సమయంలో మాత్రం వారి వారి మాత్రుశాఖల నుంచే వీరందరికీ నియామకపత్రాలు అందించారు. అంతవరకూ బాగానే ఉన్నా..రాష్ట్రప్రభుత్వం ఈనెల 25వ తేదీన వీడుదల చేసిన జీఓనెంబరు -5 తోనే అసలు చిక్కంతా వచ్చిపడింది. అసలు సర్వీసు రూల్సు, ప్రమోషన్ ఛానల్  లేకుండా, పేస్కేలు నిర్ధిష్టంగా ఎంత వస్తుందో చెప్పకుండా, అందరికీ కలిపి ఒక ఒక్క జీఓను ఇచ్చి చేతులు దులుపుకుంది. 

19 ప్రభుత్వ శాఖలకు చెందిన జీఓలను ఇంకా విడుదల చేయలేదు. అందునా ఒక్క గ్రేడ్-5 కార్యదర్శికి తప్పా మిగిలిన అన్ని శాఖల ఉద్యోగులకు ఒకే రకంగా పేస్కేలు నిర్ధారిస్తూ జీఓలో ఉటంకించారు. ప్రభుత్వం సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ, పేస్కేలు అమలు చేస్తున్నట్టు మాత్రమే జీఓ ఇచ్చింది. దీనిని అనుసరించి మిగిలిన శాఖల సర్వీసు రూల్సు ఏర్పాటు చేసి జీఓలు ఇస్తే తప్పా, వీరి భవిష్యత్తు ఏంటనే తేలదు. లేదంటే వీరంతా జీవితంత కాలం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులుగా ఉద్యోగం వచ్చినచోట పనిచేయాలి. గతంలో ప్రభుత్వం ఏంపీడీఓ వ్యవస్థ ఏర్పాటు చేసినపుడు వారికి కూడా సర్వీసు రూల్స్, పదోన్నతుల విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో నేటికీ  ఎంపీడీఓలుగానే రిటైర్ అయ్యారు. అవుతున్నారు కూడా. ఇటీవల కాలంలో ఎంపీడీఓలకు పదోన్నతులు ఇస్తామని ప్రకటించినా..ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోలేదు. తీసుకుంటుందో..లేదో కూడా తెలియదు. కారణం ఇంకా ఈ ప్రభుత్వానికి గడువు రెండేళ్లు లోపు మాత్రమేవుంది. ఇపుడు సచివాలయ ఉద్యోగులకు కూడా ఇవే ఇబ్బందులు రాబోతుండటంతో వారంతా తమ పరిస్థితి కూడా ఇలానే ఉంటుందనే అనుమానాన్ని, భయాన్ని, ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.


పీఆర్సీ ఏవిధంగా వర్తింప చేశారు..?
రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ద్వారా పెంచిన పేస్కేలు ఇస్తున్నట్టు చెప్పినా.. ఇతర శాఖల ప్రభుత్వ ఉద్యోగులుకు ఇచ్చినట్టుగా సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయలేదని తేటతెల్లమైపోయింది. పీఆర్సీని అమలు చేస్తే.. హెచ్ఆర్ఏ, డీఏ కలుపుకొని ఎంత వస్తుందనేది మాత్రం జీఓలో స్పష్టత ఇవ్వలేదు. దానిని ఒక్కో మీడియా సంస్థ ఒక్కోలా ఉద్యోగులను అయోమయంలోకి నెట్టేస్తూ వార్తల రూపంలో వండి వార్చేస్తుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సమయంలోనే ప్రభుత్వం ఒక నిర్ధిష్ట ప్రకటన చేయలేదు. ఉద్యోగాలకు డిగ్రీ అర్హత పెట్టినా నాల్గవ తరగతి ఉద్యోగుల కంటే తక్కువ కేడర్ లోనే వీరిని ఉంచేసింది. అందులోనూ సచివాలయ శాఖలో 19ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ ఏ ఒక్కరి విషయంలోనూ ప్రమోషన్ ఛానల్, సర్వీస్ రూల్స్, డిపార్ట్ మెంటల్ టెస్టులు తదితర అంశాలేమీ పొందు పరచలేదు. ఇప్పటికే రెండేళ్లు చేయాల్సిన సర్వీసు ప్రొబేషన్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు 39 నెలలు చేస్తున్నారు. కాదు కాదు చేయించిన తరువాత  మాత్రే వీరందరికీ సర్వీస్ ప్రొబేషన్ క్లియర్ అవుతుందని, జూలై నెలాఖరు వరకూ వీరి ప్రొభేషన్ కొనసాగి ఆగస్టు 1 నుంచి పేస్కేలు అందుకుంటారని జీఓనెంబరు-5లో పేర్కొంది ప్రభుత్వం. మరోప్రక్క సచివాలయ ఉద్యోగులు, నియామకాలు, వారి అధికారాలపై ఇంకా కోర్టుల్లో కేసులు నలుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం జారీచేసిన ప్రొబేషన్ డిక్లరైజేషన్ జీఓ సచివాలయ ఉద్యోగులను అయోమయంలోకి నెట్టేసింది.


మళ్లీ సచివాలయ ఉద్యోగాలు మరోసారి తీసే పనిలేకుండా.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీసు రూల్స్, పదోన్నతులపై జీఓ ఇస్తే ఏడేళ్ల తరువాతనో, లేదంటేం పదేళ్ల తరువాతనో ఉన్న ఉద్యోగులంతా పదోన్నతులపై వారి వారి శాఖల్లో పెద్ద స్థాయికి వెళతారు. ఆ సమయంలో సచివాలయాల్లో ఖాళీ అయిన అన్ని ఉద్యోగాలను మళ్లీ  భర్తీ చేయాల్సివుంటుంది. అలా చేయాల్సి వస్తే ప్రతీ ఏడు సంవత్సరాల కొకసారి గ్రామ, వార్డు సచివాలయ శాఖలో 1.34 లక్షల ఉద్యోగాలు భర్తీచేయాల్సి వుంటుంది. అదే జరిగితే ప్రభుత్వంపై చాలా పెద్ద మొత్తంలో ఆర్ధిక భారం పడుతుంది. అలా కాకుండా సర్వీసు రూల్స్ గానీ, ప్రమోషన్ ఛానల్ గానీ ఏర్పాటు చేయకపోతే సచివాలయ ఉద్యగులు, ఎన్నేళ్లైనా ఇక్కడే అలాగే ఉండిపోతారు. వారికి జీతం పెరుగుతుంది తప్పితే ఉద్యోగంలో ఎలాంటి ఎదుగు, బొదుగూ ఉండదు.  ఒక వేళ కోర్టులను ఆశ్రయించినా వాయిదాలతోనే ప్రభుత్వం పదవీ కాలం పూర్తయిపోతుంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ఇతర ప్రయోజనాల మీద ద్రుష్టిపెడతారు తప్పితే ఉద్యోగుల సర్వీసు రూల్స్, పదోన్నతుల కోసం ఆలోచించే సమయం వుండదు. వచ్చే ప్రభుత్వం ఇదే  అయితే మరోసారి ఆలోచిస్తామనో..లేదంటే కొత్తగా సర్వీసు రూల్సు అమలు చేస్తామనో ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకుంటారు.. మారీ కూడదు అనుకుంటే పదోన్నతులు అడగకుండా చేస్తున్న విధినిర్వహణలో ప్రస్తుతం రెండవ శనివారాలు, ఆదివారాలు, పండుగ సెలవులు అనే తారమతమ్యం లేకుండా ప్రత్యేకంగా విధులు చేయిస్తున్నదానికంటే రెండింతలు నిర్వహించేలా చేస్తూ... కఠిన నిర్ణయాలు, అదనపు విధులు అమలు చేస్తే.. కనీసం సెలవులు అడిగి ప్రమోషన్ కోసం మాట్లాడకుండా ఉంటారని కూడా ప్రచారం జరుగుతుంది.

పేరుకే భారీ సంఖ్యలో ఉద్యోగాలు..తలా..తోకా లేనే లేదు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినట్టుగానే గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు చేసి సుమారు లక్షా 34వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసినా.. ఆ ఉద్యోగాలకు తలాతోకా ఏమీ లేకుండా పోయిందనేది ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి సర్వీసు రూల్సు, ప్రమోషన్ ఛానల్ అమలు చేయకపోవడంతో ఆ విషయం తేటతెల్లమైపోయింది. భారత దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా 33 నెలలు సర్వీసు ప్రొబేషన్ ఉద్యోగులతో చేయించిన క్రమంలో అదనంగా పనిచేసిన కాలానికి ఉద్యోగులు సుమారు రూ.1.50 లక్షల వరకూ ఉపయోగాలు కోల్పోయారు. ఇపుడు ప్రమోషన్ ఛానల్ ప్రకటించకపోవడంతో వీరంతా ఇవే ఉద్యోగాల్లో జీవితాంతం పనిచేయాల్సి వస్తుంది. రెగ్యులర్ ఉద్యోగమనే ఒకే ఒక్క నమ్మకంతో లక్షల్లో జీతాలు వదులుకొని వచ్చిన సచివాలయ ఉద్యోగులందరికీ ప్రభుత్వ తీరుతో నిరాశ ఎదురైంది. దానికితోడు, సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ఇచ్చిన జీఓకి, మిగిలిన 19శాఖల ముఖ్య అధిపతుల నుంచి ప్రత్యేకంగా జీఓలు రాకపోవడంతో సచివాలయ ఉద్యోగులపై అయోమయ బాంబు పడ్డట్టు అయ్యింది. పేరుకే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు ఖాళీలు భర్తీచేసినా వారికి జీఓనెంబరు 149ని అమలు చేయకపోవడం, మహిళా పోలీసు ఉద్యోగాలు భర్తీచేసినా వారు యూనిఫారం పోలీసుల క్రిందికి వస్తారో, కార్యాలయ పోలీసు సిబ్బందికి వస్తారో క్లారిటీ ఇవ్వకపోవడం, అన్నింటికంటే ముఖ్యంగా వీరంతా ఏ తరగతి ఉద్యోగుల క్రిందికి వస్తారో కూడా అధికారికంగా చెప్పకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది.

 కొత్తగా ప్రభుత్వ శాఖ ఏర్పాటు చేసినపుడు ఎక్కడైనా వారికి ప్రాధమికంగా ఇచ్చే ఉద్యోగంతోపాటు, ఐదేళ్ల తరువాతో, ఏడేళ్ల తరువాతో వారికి ఏ తరహా పదోన్నతులు కల్పిస్తారో చెబుతూ, సర్వీసు రూల్స్ ఫ్రేమ్ చేస్తారు సదరు ప్రభుత్వశాఖల ముఖ్య కార్యదర్శిలు. విచిత్రంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని 19శాఖల ఉద్యోగుల విషయంలో ఎలాంటి క్లారిటీ లేకుండా ఉద్యోగాలు భర్తీచేసి, ఇపుడు ఆగస్టు1 నాటికి ప్రొబేషన్ డిక్లరేషన్ కూడా ప్రకటించింది. చూడాలి ముందు ముందుకైనా వీరు ఏ తరగతి ఉద్యోగుల క్రిందికి వస్తారు, అసలు పదోన్నతులు, బదిలీలు, ఉంటాయా ఉండవా? వీరి సర్వీసు మొత్తం ఇక్కడే రిటైర్ అయిపోతారా అనే విషయాలపై క్లారిటి వస్తుందా.. లేదా.. అనేది. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ(ఈఎన్ఎస్), అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens live App, www.enslive.net ఎప్పుడూ ఉద్యోగులు, వారి సమస్యలు, ఇబ్బందులను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లేందుకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఆ క్రమంలోనే ఉద్యోగులకు జరగబోయే నష్టాన్ని, ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు చేసిన తరువాత 19శాఖలకు చెందిన ముఖ్యకార్యదర్శిలు చేసిన తప్పుల వలన ఉద్యోగులకు జరిగే నష్టాన్ని సవివరంగా తెలియజేసింది..!