ఎన్.డి.ఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం అమరావతి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమెను అధికార వైఎస్సార్సీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా నే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాధ్ను ద్రౌపది ముర్మును పరిచయం చేశారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా తనకు మద్దతు ఇవ్వాలని ఎంపీలను కలవడానికి ఆమె రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్ధి ముర్ముకు వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తుందని ప్రకటించింది. ఆమె నామినేషన్ సమయంలో కూడా రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ప్రధానిమంత్రితో కలిసి వెళ్లి తమ మద్దతును తెలియజేశారు.