వైజాగ్ లో ఆటో నడిపిన సీఎం వైఎస్ జగన్


Ens Balu
2
Visakhapatnam
2022-07-15 06:56:10

ముఖ్యమంత్రి అంటే పెద్ద స్టేజీలపై ఆర్బాటాల ప్రసంగాలే ఇప్పటి వరకూ చూశాం.. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకు వేశారు. వాహనమిత్ర పథకాన్ని లబ్దిదారులకు పంచడానికి విశాఖ వచ్చిన ఆయన నేరుగా లబ్దిదారుని ఆటో ఎక్కి ఆటో నడిపారు. ఆటో నడిపేటపుడు ఖచ్చితంగా ఖాకీ చొక్కా ఉండాలనే నిబంధనను ఎక్కడా మరిచిపోకుండా ఖాకీ చొక్కా వేసుకొని మరీ ఆటో ఎక్కారు సీఎం జగన్. ఈ సంఘటతో సదరు లబ్దిదారిణి ఆనందానికి అవదులు లేవు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఒక సాధారణ ఆటో ఎక్కి ఈ విధంగా డ్రైవర్లును ప్రోత్సహించడం అక్కడున్న పార్టీ నాయకులను, అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆంధ్రాయూనివర్శిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్వయంగా ఆటోని మహిళా డ్రైవర్ ని నడపమని చెప్పి అందులో సీం ప్రయాణించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్.జగన్ మాట్లాడుతూ, వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ వాహన మిత్ర ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 261.51 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం కలిగిన వారికి ఆర్థిక సాయం అందజేస్తున్నామని సీఎం చెప్పారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందచేస్తున్నామన్నారు. తమకు తామూ స్వయం ఉపాధి కల్పించుకుని.. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారన్నారు.