ఇక దొంగ ఓట్లుకు ఆథార్ లింక్ తో చెక్..


Ens Balu
19
Guntur
2022-07-16 06:07:57

భారతదేశంలో దొంగ ఓట్లకు చెక్ పడనుంది..దేశ వ్యాప్తంగా నికార్శైన ఓటర్ల జాబితా సిద్దం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. దానికోసం ఆధార్ కి ఓటరు కార్డును అనుసంధానించనుంది. ఈ విధంగా చేయడం ద్వారా నకిలీ ఓట్లు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఏర్పడింది. దానికోసం ఆగస్టు 1వ తేది నుంచి దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లోని ఓటర్ల కార్డులకు ఆధార్ ను అనుసంధానించే కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే దానికోసం ప్రభుత్వం ప్రకటన కూడా జారీచేసింది. అన్ని రాష్ట్రాలకు ఈ వర్తమానాన్ని పంపింది. ఈ విధంగా చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశ వ్యాప్తంగా వున్న నకిలీ ఓట్లకు చెక్ పడనుంది. ఖచ్చితంగా ఓటరు కార్డుకి ఆధార్, మొబైల్ నెంబరును అనుసంధానిస్తారు. అలా చేయడం ద్వారా అదే పేరుతో ఎన్ని ఓట్లు ఉన్నాయో కేంద్ర, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్  డేటాబేస్ ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా తెలిసిపోతుంది. ఈ అనుసంధానం తరువాత 2024 ఎన్నికల్లో ఆధార్ కార్డునే ఓటు వేసేందుకు కూడా అనుమతించాలనే ఆలోచనతోనే ఈ కార్యాచరణ పూర్తిచేయనున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో ఓటరు నవీకరణ జాబితాలు తయారు చేస్తారు. అలాంటి సమయంలో కొన్ని అధనంగా ఓట్లు పెరిగే అవకాశం వుంటుంది. ఇలా పెరిగే సమయంలో కరెక్టు ఓటర్లు మాత్రమే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఆధార్ ను ప్రతీ ప్రభుత్వ పథకానికి అనుసంధానిస్తూ వస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇపుడు ఓటరు కార్డుకి కూడా వీటిని లింక్ చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చుననేది  ఆలోచన.

ఓటరు కార్డుకి ఆధార్ కార్డును అనుసంధానించడం ద్వారా భారీ సంఖ్యలోనే నకిలీ ఓట్లు, దొంగ ఓట్లు, ఒకే పేరు వివిధ ప్రాంతాల్తో నమోదైన ఓట్లును రద్దు చేసే అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఓటరు ఏ ప్రాంతంలో ఐదేళ్లకు పైగా ఉంటారో  అక్కడే తన ఓటును శాస్వతంగా ఉంచే నిర్ణయంలో భాగంగానే ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందని అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఎన్నికల్లో పారదర్శకత ఏర్పడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ విధానం వలన దేశ వ్యాప్తంగా చాలా రాజకీయపార్టీలు చాలా నష్టపోయే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి. ఒకే వ్యక్తి పేరుతో వివిధ ప్రాంతాలు, నియోజకవర్గాల్లో ఓటు కలిగిన వారు దేశ వ్యాప్తంగా చా ఎక్కువ మంది ఉన్నారు. ఇకపై అలాంటి ఓట్లన్నీ ఆధార్ అనుసంధానంతో రద్దైపోతాయి. ఆధార్ అనుసంధాన కార్యక్రమం ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభించి దానిని పూర్తిస్థాయిలో చేపట్టడానికి తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ కార్యక్రమం సత్వరమే జరగడానికి అవకావాలు ఏర్పడ్డాయి. సచివాలయాల్లో 19శాఖల సిబ్బంది, వాలంటీర్లు అందుబాటులో ఉండటంతో ఈ పని ఏపీలో సత్వరమే పూర్తవుతుందని చెబుతున్నారు. కానీ ఈ కార్యక్రమానికి గ్రామ వలంటీర్లను దూరంగా ఉంచాలనే డిమాండ్ అన్ని రాజకీయ పార్టీల నుంచి వ్యక్తం అవుతుంది.


ఆధార్ తో ఓటరు కార్డులు అనుసంధానం చేపడితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే లెక్కకు మించిన ఒకే పేరుతో వివిధ ప్రాంతాల్లో వున్న ఓట్లు రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో నూతన ఓటర్ల నమోదు కూడా చేసే అవకాశం కూడా లేకపోలేదు. అదనంగా ఉన్న ఓట్లు పోయినా.. కొత్తగా నమోదు అయ్యే ఓట్లతో 2024లో ఎన్నికలు జరపాలని కేంద్రం ఎన్నికల కమిషన్ యోచించే సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందే ఈ ఓటరుకార్డుకి ఆధార్ నెంబరు అనుసంధాన కార్యక్రమం చేపట్టిందని చెబుతున్నారు. ఒక రకంగా చూసుకుంటే ఈ విధానం అన్ని రాజకీయ పార్టీలకు సంకటంగానే పరిణమించే పరిస్థితి ఉన్నా.. దొంగ ఓట్లు, ఒకే వ్యక్తికి వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండటంతో చాలా రాజకీయపార్టీలు తమకు పడాల్సిన ఓట్లు లాసు అయిపోతున్నామనే భావనతో ఈ విషయాన్ని కేంద్రం ద్రుష్టికి తీసుకెళ్లిన తరువాత..మెజార్జీ రాజకీయ పార్టీల అభ్యర్ధన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఆధార్ అనుసంధానంతో లక్షల ఓట్లు రద్దుఅవుతాయా.. వేల సంఖ్యలో ఓట్లు రద్దు అవుతాయి..ఏం జరుగుతుందనేది ఆగస్టు 1 దాటిన తరువాత తేల నుంది. ఆధార్ అనుసంధాన కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, బీఎల్వోలకు అప్పగించి చేయించడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్నిఏర్పాట్లు పూర్తిచేసింది. చూడాలి..ఈ అనుసంధాన ప్రక్రియతో ఏం జరగబోతుందనేది..!